
ఓ తల్లి కావలలకు జన్మనిచ్చింది. కానరాని లోకాల వెళ్లింది.
--- డెలివరీ అయిన 10 రోజులకే తల్లి మృతి.
-- పిల్లల్ని చూడకుండానే మృతి చెందిన తల్లి.
--- సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య మే కారణమని పిర్యాదు.
-- విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి
తన ఇద్దరు పిల్లలు కవలలకు జన్మనిచ్చింది.పండంటి పిల్లలను చూడకుండానే కానరాని లోకాలకు వెళ్లిన తల్లి. ప్రేమించి పెళ్లి చేసుకుని పండంటి కవలలకు జన్మనిచ్చి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది.
*మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం*.. లింగన్నపేట గ్రామానికి చెందిన తమ్మనవేణి సౌజన్య 23, భానుచందర్ 2 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గర్భం దాల్చిన సౌజన్య కు గత నెలలో పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆపరేషన్ చేయగా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఆపరేషన్ తర్వాత సౌజన్యకు రక్తం తక్కువ ఉందని కరీంనగర్ హాస్పిటల్కు తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా 10 రోజులకే చికిత్స పొందుతున్న సౌజన్య శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. సౌజన్య మృతికి కారణం సిరిసిల్ల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025