
కాసుల మత్తు... పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..?
*దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..!
*ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..?
*మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..?
*నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..?
*బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..?
వారం వారం టార్గెట్లు..
* అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం కేంద్రంలో ముందు మద్యం దుకాణాలతో పాటు నాగుల వంచలో మరో దుకాణం ఉన్నట్లు ప్రభుత్వా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చింతకాని మండల వ్యాప్తంగా ఉన్న 26 గ్రామపంచాయతీ పరిధిలో 60 కి పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ నెలా నెలా వసూళ్లకు పాల్పడుతూ.. పెద్దగా పట్టించుకోవటం లేదని ఆరోపణలు చింతకాని బోనకల్ మండలాలలో ప్రధానంగా వినిపిస్తుంది. ఒక్కొక్క క్వార్టర్ కు అదనంగా 30 రూపాయలు బీరుకు 50 రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదనేఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చింతకాని నాగులవంచ వైన్ షాపులు నుండి నిత్యం ఆటోలు ద్విచక్ర వాహనాల ద్వారా సరఫరా జరుగుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుడి మసీదులు పాఠశాలలు అనే పద్ధతి పాటించకుండా వైన్ షాపులు నిర్వహిస్తూ బెల్ట్ షాపుల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంపై అధికారుల వివరణలు తో పాటు నిర్వాహకులు చేస్తున్న దోపిడీపై రేపటి కథనం 2 లో వేచి చూడండి..!
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025