
20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే
సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..?
ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..?
కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు...?
*పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో గట్టు సింగారం భూ సమస్యకు పరిష్కారం ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన రెవెన్యూ అధికారులు. ?
అక్రమాలకు అడ్డాగా కూసుమంచి రెవెన్యూ కార్యాలయం
*ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు కూడా అవినీతి ఉచ్చులో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోరేందుకు..?
అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూసుమంచి మండల బాధితులు
అక్రమాల పుట్ట అవినీతి గుట్ట కూసుమంచి రెవెన్యూ కార్యాలయం సాక్షిగా బాధితులకు అందని న్యాయ సహాయం
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలుగు దినపత్రిక
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పలు గ్రామాలలో గతంలో పనిచేసిన ఇద్దరు తాసిల్దారులు రెవిన్యూ రికార్డులను మార్చి పేదలకు రైతులకు అన్యాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అవినీతికి అక్రమాలకు పాల్పడి బాధితులకు అన్యాయం చేసినట్లు కొందరు 20 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో కూసుమంచి మండలం గట్టు సింగారం రెవిన్యూ పరిధిలోని ఓ సర్వే నెంబర్లలో సర్వే చేస్తామంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు బాధితులకు అందించి సర్వే చేయకుండా హక్కులకు భంగం కలిగించినట్లు ఆ మేరకు బాధితులు స్థానిక కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ మేరకు తెలుస్తోంది. సర్వే అడ్డుకుంటున్నట్లు సంబంధిత మండల సర్వే బాధితులకు వ్యతిరేకంగా చర్చలు జరిపి అడ్డుకునేటట్లు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. వచ్చామా వెళ్లేమా అనే విధంగా రెవెన్యూ అధికారులు సర్వేలు వ్యవహరించడం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే విషయంపై కూసుమంచి తాహ సిల్దార్ రవికుమార్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా విశేషం ఇదే భూమి విషయంపై మన ప్రజావాణి అనేక సంచలన కథనాలు అందించిన సంగతి అధికార యంత్రాంగాలకు ఉమ్మడి జిల్లా పాఠకులకు తెలిసిందే. నాటి ప్రభుత్వ హయాంలో ధరణిలో లోపాల వలన భూభారతి చట్టం చేశారు ప్రస్తుతం అమలులో ఉన్న నేపథ్యంలో హక్కు కలిగిన పేదలకు బాధితులకు రెవెన్యూ అధికారుల తీరు వలన తీరని అన్యాయం జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్వే నిర్వహించేటట్లు బాధితులకు న్యాయం దక్కేటట్లు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025