కెనడా ఇంటెలీజెన్స్ అధికారులే క్రిమినల్స్ : కెనడా ప్రధాని ట్రూడో

Ramesh

Ramesh

District Chief Reporter

కెనడా(Canada) ప్రభుత్వ ఇంటెలీజెన్స్ అధికారులపై సాక్షాత్తూ ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో(Trudeau) ఫైర్ అయ్యారు. ‘‘కెనడాలో జరిగిన హింసాత్మక ఘటనలతో భారత(India) ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లకు ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేసిన ఇంటెలీజెన్స్ అధికారులే క్రిమినల్స్’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ ఆ క్రిమినల్స్ (కెనడా ఇంటెలీజెన్స్ అధికారులు) టాప్ సీక్రెట్ సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు. అయితే వాళ్లు లీక్ చేస్తున్నదంతా తప్పుడు సమాచారమే. దానితో మీడియా అడ్డదిడ్డంగా కథనాలు వండి వారుస్తోంది. మీడియా అలా చేయడం ముమ్మాటికీ తప్పే’’ అని ఆయన విమర్శించారు.

ఇటీవలే ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ అనే కెనడా వార్తాపత్రికలో ఒక సంచలన కథనం ప్రచురితమైంది. కెనడా నిఘా వర్గాల సమాచారం అని పేర్కొంటూ పబ్లిష్ చేసిన ఆ కథనంలో.. ‘‘కెనడాలో జరిగిన పలు హింసాత్మక ఘటనల సమాచారం ముందే భారత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్‌ఏ అజిత్ దోవల్‌లకు తెలుసు’’ అని ప్రస్తావించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన కెనడా విదేశాంగ శాఖ.. ఆ వార్తలో ప్రస్తావించిన అంశాలన్నీ తప్పులే అని వెల్లడించింది. కెనడా ఇంటెలీజెన్స్ విభాగాలకు అలాంటి సమాచారమేదీ అందలేదని స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share