ఆ నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత కమల వికాసం

Ramesh

Ramesh

District Chief Reporter

ఉత్తరప్రదేశ్(Uttarapradesh) రాష్ట్రంలో బీజేపీ(BJP) రెండు సార్లు భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికి ఓ నియోజకవర్గంలో మాత్రం కాషాయ పార్టీ గత 30 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీ.. గత చరిత్రను తిరగ రాస్తు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ నియోజకవర్గంలో విజయం దిశగా ముందుకు సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కుండార్కి నియోజకవర్గానికి(Kundarki Constituency) ఉప ఎన్నికలు(By-elections) జరిగాయి. ఈ నియోజకవర్గంలో 60 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీంతో రాష్ట్రం మొత్తం బీజేపీ(BJP) గెలిచినప్పటికీ ఇక్కడ మాత్రం ఆ పార్టీకి గతంలో పరాభవం తప్పలేదు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా కమలం పార్టీ విజయం దిశగా ముందుకు సాగుతోంది.

11 మంది ముస్లిం అభ్యర్థులతో పోటీ పడిన బీజేపీ అభ్యర్థి రామ్‌వీర్ సింగ్(Ramveer Singh) 19 రౌండ్లు ముగిసే సమయానికి 98,537 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు మొత్తం 1,11,470 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి మహమ్మద్ రిజ్వాన్‌కు 12,933 ఓట్లు వచ్చాయి. కాగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ.. మిగిలిన రౌండ్లలో లెక్కించాల్సిన ఓట్ల కంటే.. ప్రస్తుతం ఆయన లీడ్ అధికంగా ఉండటంతో.. ఈ ఉప ఎన్నికలో కుండార్కి నియోజకవర్గం నుంచి రామ్ వీర్ సింగ్ విజయం ఖాయమైంది. దీంతో 30 సంవత్సరాల తర్వాత కుండార్కి నియోజకవర్గంలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share