56 లక్షల మంది ఫాలోవర్స్.. ఎన్నికల్లో పోటీ చేస్తే పడ్డ ఓట్లు కేవలం 146

Ramesh

Ramesh

District Chief Reporter

గడిచిన కొంతకాలంగా చాలా మంది సెలబ్రేటీలు తమకు ఉన్న ఫాలోవర్స్(followers) ను చూస్తూ మురిసిపోతు.. రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికి ఎన్నికల్లో పోటీ చేసి ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూట గట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్(Actor Ajaz Khan) ఆజాద్ సమాజ్ పార్టీ(Azad Samaj Party) తరుఫున వెర్సోవాలో పోటీ చేశారు. ఈయనకు ఇన్‌స్ట్రాగ్రామ్‌(Instagram)లో ఏకంగా 5.6 మిలియన్స్(56 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆతని ఫలితాలపై సోషల్ మీడియా(Social media) ఆసక్తిగా ఎదురు చూసింది.
ఈ క్రమంలో వెలువడిన ఫలితాలు 56 లక్షల మంది ఫాలోవర్స్ (followers) ఉన్న నటుడితో పాటు అతనికి టికెట్ ఇచ్చిన పార్టీకి, ఆయన ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. ఆయనకు కేవలం 146 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నటుడికి వచ్చిన ఓట్లతో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన.. రాజకీయాల్లో రాణించలేరని.. దీనికి నటుడు అజాజ్ ఖాన్ నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం సులభం కాదని.. మరోసారి రుజువైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share