మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందన్న ఉక్రెయిన్

Ramesh

Ramesh

District Chief Reporter

మూడవ ప్రపంచ యుద్ధం(3rd World War) మొదలైందా.. అవును అనే అంటోంది ఉక్రెయిన్(Ukraine). మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో దాదాపు అన్ని దేశాల ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చివేశాయి. కొన్ని నగరాలు నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుకు పోతే.. కోట్లాది మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ యుద్ధాలు తలచుకొని కన్నీళ్ళు పెట్టని దేశం ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. చాలా పరిమిత సాంకేతిక ఉన్న ఆరోజుల్లోనే పరిస్థితి అలా ఉంటే.. మరి ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అనే ఊహనే వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం. కాని మూడవ ప్రపంచ యుద్ధం మొదలైంది అంటూ ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రష్యా(Russia) మిత్ర దేశాలు మూకుమ్మడిగా ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం అని ఉక్రెయిన్ మాజీ సైన్యాధికారి వలెరీ జలూజ్నీ అన్నారు. ఉత్తర కొరియా, ఇరాన్ బలగాలు, ఆయుధాలను ప్రయోగించి ఉక్రెయిన్ అమాయకులను రష్యా హతమార్చి, మూడవ ప్రపంచ యుద్ధానికి రష్యా తెరలేపిందని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా యుద్ధాన్ని ఇరు దేశాలకు మాత్రమే పరిమితం చేయాలని ఉక్రెయిన్ మిత్ర పక్షాలను ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share