వచ్చే ఏడాది భారతీయుల కోసం ఇజ్రాయెల్ ఈ-వీసా సౌకర్యం

Ramesh

Ramesh

District Chief Reporter

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇజ్రాయెల్ ఈ ఏడాది భారతీయ పర్యాటకుల సంఖ్య 10,000కు చేరుతుందని ఆశిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం ఈ-వీసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ అధికారి గురువారం ప్రకటనలో చెప్పారు. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, అమృత బంగేరా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు దాదాపు 8,500 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ‘2018లో ఇజ్రాయెల్ 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అప్పటివరకు అత్యధిక రికార్డు. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ పర్యాటకంపై ప్రభావం చూపడంతో సందర్శకులు తగ్గారు. 2022లో మళ్లీ భారతీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఏడాది 30,900 మంది పర్యాటకులు ఇజ్రాయెల్ వచ్చారని ‘ ఆమె వివరించారు. ఆ తర్వాత 2023లో 41,800 మంది పర్యాటకులు వెళ్లగా, ఈ ఏడాది యుద్ధ పరిస్థితుల వల్ల జనవరి-అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు పర్యటించారు. ఏడాది చివరి నాటికి భారతీయ పర్యాటకుల సంఖ్య దాదాపు 10,000కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share