నెక్ట్స్ టార్గెట్ అమెరికా మిలిటరీ బేస్.. రష్యా ప్రకటన

Ramesh

Ramesh

District Chief Reporter

ఉక్రెయిన్‌పై రష్యా(Russia) విరుచుకుపడింది. అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను తమ దేశంపైకి ఎక్కుపెట్టినందుకు కీవ్‌పై పుతిన్ సేన ప్రతీకారం తీర్చుకుంది. తొలిసారిగా ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడిచేసింది. గురువారం మధ్యాహ్నం ఈ ఎటాక్ జరిగింది. ఇది జరిగిన టైంలో రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. మీడియాతో మాట్లాడుతుండగా ఆమెకు ఉన్నతస్థాయి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఖండాంతర క్షిపణి దాడి గురించి ఎలాంటి కామెంట్స్ చేయొద్దని, మౌనంగా ఉండాలని ఫోనులో ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

 

రష్యాకు 5వేల కిలోమీటర్ల దూరంలోని పోలండ్‌(Poland) దేశపు రెడ్జికోవో ప్రాంతంలో అమెరికా నవంబరు13న ప్రారంభించిన సైనిక స్థావరం(US military base)పై మారియా జఖరోవా ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తమ దేశం అత్యాధునిక ఆయుధాలతో ధ్వంసం చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా సిద్ధం చేసుకున్న ప్రధాన శత్రు లక్ష్యాల జాబితాలో పోలండ్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌ కూడా ఉందని మారియా స్పష్టం చేశారు. రష్యా, దాని పరిసర దేశాలలో అస్థిరతను సృష్టించే కుట్రతో అమెరికా సారథ్యంలోని నాటో కూటమి పోలండ్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించారు. రష్యా వార్నింగ్‌తో అలర్ట్ అయిన పోలండ్ కీలక ప్రకటన విడుదల చేసింది. కేవలం తమ దేశ ఆత్మరక్షణ కోసమే ఆ మిలిటరీ బేస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అక్కడ న్యూక్లియర్ మిస్సైల్స్ లేవని తేల్చి చెప్పింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Share