‘అదానీ’ వ్యవహారంపై రాజకీయ దుమారం.. కేంద్ర, రాష్ట్రాల రియాక్షన్

Ramesh

Ramesh

District Chief Reporter

అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీ(Adani)పై అమెరికా(US)లో కేసులు నమోదవడంపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడిగా గౌతం అదానీని భావిస్తుంటారు. అటువంటి పారిశ్రామిక దిగ్గజం చుట్టూ అమెరికాలో చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండటాన్ని భారత్‌లోని కేంద్ర(Centre Govt), రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదానీ గ్రూపుపై అమెరికాలో కేసులు నమోదైనందున తాము స్పందించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదానీ గ్రూపు వ్యవహారంలో పేర్లు వినిపిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై క్లారిటీ ఇస్తే సరిపోతుందని బీజేపీ వాదిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ప్రస్తుతం ఫోకస్‌లో ఉన్నాయి.

‘‘అదానీ గ్రూపుతో తమిళనాడు విద్యుత్ శాఖ నేరుగా ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదు. 25 ఏళ్ల పాటు ఒక్కో యూనిట్‌కు రూ.2.61 చొప్పున వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్’తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ దీనిపై స్పందిస్తూ.. తమ హయాంలో అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో గత బీజేడీ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా వ్యవహరించిన పి.కె.దేవ్ స్పందిస్తూ.. అదానీ గ్రూపు నుంచి తాము ఎలాంటి ముడుపులూ తీసుకోలేదని తేల్చి చెప్పారు. నిరాధార ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share