సెన్సెక్స్ 30లోకి జొమాటో ఎంట్రీ.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల్లో కొత్తగా 43 స్టాక్స్ కు చోటు..!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) త్వరలో సెన్సెక్స్ 30(Sensex 30)లోకి ఎంట్రీ అవ్వనుంది. ఈ విషయాన్ని భారతదేశపు పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సూచీలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్(JSW Steel) ప్లేసులో జొమాటో రీప్లేస్(Replace) కానుందని, డిసెంబర్ 23 నుంచి ఈ కొత్త మార్పు అందుబాటులోకి రానుందని తెలిపింది. కాగా శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో షేర్ వాల్యూ 0.72 శాతం తగ్గి రూ. 265 వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో ఈ సంస్థ షేర్ విలువ ఏకంగా 136 శాతం పెరిగింది.

ఇదిలా ఉంటే సెన్సెక్స్ 30తో పాటు బీఎస్ఈ 100, బీఎస్ఈ 50, బీఎస్ఈ నెక్స్ట్ 50 సూచీల్లో కూడా బీఎస్ఈ(BSE) పలు మార్పులు చేపట్టింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు(F&O Contract)ల్లో కొత్తగా 43 స్టాక్స్(Stocks)కు అవకాశం కలిపించింది. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, యెస్ బ్యాంక్, వన్ 97 కమ్యూనికేషన్స్, డీమార్ట్ , జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ తదితర షేర్లు ఉన్నాయి. డిసెంబర్ 13 నుంచి ఈ కొత్త కాంట్రాక్టులు స్టార్ట్ కానున్నాయి. కాగా సెన్సెక్స్ మొత్తం 30 కంపెనీలను కలిగి ఉంటుంది. లిక్విడిటీ, మార్కెట్ క్యాపిటలైజేషన్, రాబడి, వైవిధ్యత ఆధారంగా ఈ 30 కంపెనీలను ఎంపిక చేస్తారు. అలాగే ఒక కంపెనీ సెన్సెక్స్‌లో ఉండాలంటే బిఎస్‌ఇలో లిస్ట్ అయి ఉండాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share