తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్.. గుజరాత్ చేతిలో పరాజయం

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఓటమి చవిచూసింది. శనివారం నోయిడాలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 31-28 తేడాతో పోరాడి ఓడిపోయింది. ఇరు జట్లు మొదటి నుంచి పాయింట్ల కోసం పోటీపడటంతో మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అయితే, ఆశిశ్ నర్వాల్ సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఫస్టాఫ్‌లో 17-15తో స్వల్ప ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లో కాసేపటకే టైటాన్స్ ఆలౌటవడంతో ఆ జట్టు 20-17తో వెనుకబడింది. ఆ తర్వాత చాలా సేపు గుజరాత్ స్వల్ప లీడ్‌లో ఉంది. ఈ సమయంలో విజయ్ మాలిక్, ఆశిశ్ నర్వాల్ పోరాటంతో టైటాన్స్ 26-26తో స్కోరును సమం చేసింది. అయితే, ఆఖర్లో గుజరాత్ ఆధిక్యంలోకి వెళ్లి విజేతగా నిలిచింది. పీకేఎల్‌ చరిత్రలో టైటాన్స్‌పై గుజరాత్‌కు ఇది 10 విజయం. ప్రతీక్ దహియా(11 పాయింట్లు) గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించగా.. టైటాన్స్ తరపున విజయ్ మాలిక్(15 పాయింట్లు) పోరాటం వృథా అయ్యింది. మ్యాచ్ కోల్పోయినప్పటికీ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానాన్ని కాపాడుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share