మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే. ఈ చిట్కాలను ట్రై చేయండి.??

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా కల్తీయే. పప్పు నుండి ఉప్పు దాకా మరియు బియ్యం నుండి కారం దాకా ఇలా అన్నింటిని కల్తీగా మారుస్తున్నారు కేటుగాళ్లు.

అలాగే ప్రజలు ప్రాణాలు ఏమైపోయినా వాళ్లకు సంబంధం లేదు. వాళ్ల జేబులు నిండితే చాలు అని భావిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాగే గోధుమ పిండిని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. అలాగే మారిన బిజీ లైఫ్ కారణం చేత ఇన్ స్టాండ్ కోసం ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కిరాణా షాప్ లో దొరికే గోధుమ పిండినే ప్రజలు వాడుతున్నారు. ఈ గోధుమ పిండిలో కూడా కొన్ని రకాల వస్తువులు కలిపి అమ్ముతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ గోధుమ పిండిలో మైదా, మరియు ఇసుకను,చాక్ పీస్ పౌడర్ ను, అదనపు ఊకను, యూరో రూట్ పౌడర్ ఇటువంటి వాటిని కలిపి గోధుమపిండిని కల్తీ చేస్తున్నారు. ఇటువంటి పిండితో చేసిన చపాతీలను తీసుకోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఊరు పేరు లేని బ్రాండ్ తో పాటుగా లూజ్ గా దొరికే వాటిలో ఎలాంటి కల్తీ ఎక్కువగా జరుగుతుంది అని అంటున్నారు. ఇంతకీ మీరు వాడే గోధుమపిండి మంచిదేనా. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

– గోధుమపిండి యొక్క నాణ్యతను తెలుసుకోవటానికి మనం ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. తర్వాత దానిలో రెండు చెంచాల గోధుమ పిండిని వేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి. తర్వాత ఆ గోధుమ పిండి అనేది పైకి తేలినట్టు అనిపిస్తే అది నకిలీ గోధుమపిండి అని అర్థం. ఒకవేళ ఆ పిండి నీటి అడుగుకు చేరుకుంటే అది మంచిది అని అర్థం..

– సాధారణంగా మనం చపాతీలు చేసుకునేటప్పుడు పిండిని కలుపుకుంటాం. అయితే ఈ పిండి తయారు చేసేందుకు ఎక్కువ నీరు అవసరమైనా మరియు తొందరగా పిండి అనేది మెత్తగా కాకపోయినా అది కల్తీ పిండి అని అర్థం చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.

– ఇకపోతే గోధుమ పిండి నాణ్యతను నిమ్మకాయతో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో మూడు లేఖ నాలుగు చుక్కలు నిమ్మరసం పిండాలి. ఒకవేళ ఆ పిండిలో బుడగలు గనుక వస్తే అది కల్తీ అని అర్థం చేసుకోవాలి. కానీ దానిలో ఎటువంటి మార్పులు కనిపించకపోతే ఆ పిండి స్వచ్ఛమైనది అని అర్థం. సాధారణంగా ఈ పిండిలో చాక్ పౌడర్ ఉంటేనే బుడగలు వస్తాయి .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share