తహసీల్దార్ అడ్డగించిన ఆగని ఇసుక మాఫియా

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

తహసీల్దార్ అడ్డగించిన ఆగని ఇసుక అక్రమార్కుడు

అక్రమ ఇసుక మాఫియా ముఠాల ఆగడాలు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు..?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. సాక్షాత్తు మండల తహసిల్దార్ అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునే నేపథ్యంలో ఓ ట్రాక్టర్ను తహసిల్దార్ అడ్డుకున్నారు. కానీ కారు అడ్డుపెట్టిన కానీ పట్టించుకోకుండా ఓ ఇసుక అక్రమార్కుడు రెవెన్యూ సిబ్బంది ముందు నుండి అతివేగంగా పరారైన ఉదంతం జరిగిందని తెలుస్తోంది. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం వద్ద మంగళవారం ఓ అక్రమ ఇసుక పంపు వద్ద అధికారుల ఎదుటే ఇసుకను అర లోడు చేస్తూ అతివేగంగా గంధసిరికి పరారు అయినట్లు తెలుస్తోంది. కాగా ముదిగొండ మండలంలో గత ప్రభుత్వ హయాంనుండి విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఉద్యోగ కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కనీసం రెవెన్యూ అధికారులు అనే ఆలోచన లేకుండా జంకు బంకు లేకుండా దర్జాగా పరారైన వ్యవహారం మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి ముదిగొండ మండలంలో విచ్చలవిడిగా గంధసిరి పెద్దమండవ కేంద్రాలుగా నడుస్తున్న ఇసుక మాఫియా పై శాఖపరమైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share