*కేవీ స్కూల్ కి బస్ ప్రారంభం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*కేవీ స్కూల్ కి బస్ ప్రారంభం*

🟢🔵🔴
మన ప్రజావాణి// రాజన్న సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల(కేవీ స్కూల్)ని తంగళ్లపల్లి మండలం లోని పద్మనగర్ లో గల సొంత భవనంలోకి మార్చాగ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్ ని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు గారు కొబ్బరికాయ కొట్టి బస్ ని ప్రారంబించారు..సుమారు 180 మంది విద్యార్థులు సిరిసిల్ల పట్టణం నుండి విద్యాభ్యాసం కోసం కేవీ స్కూల్ కి వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్.టి.సి ని లాభాల్లోకి తీసుకురావాలని కోరారు..విద్యార్థుల కోసం మరో బస్ ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రోజు ఈ బస్ ఉదయం 7:30 నిమిషాలకి కొత్త బస్ స్టాండ్ నుండి ప్రారంభం అయ్యి పాత బస్టాండ్,గాంధీ చౌక్,పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిపో మేనేజర్ గారిని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ వర్జిలాల్, కంట్రోలర్ రామ్ రెడ్డి, కార్గో డి.ఎం. ఈ శేఖర్ రావు, ఆర్. టి. సి సిబ్బంది మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పెద్ది నవీన్ కుమార్,బండరాజు, కొండికొప్పుల రవి , తడుకల సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share