*సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..*

ఐపీఎల్ 2025లో ఇప్పటికే కావ్య మారన్‌ను చూస్తున్న క్రికెట్ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. గ్లోబల్ ఇ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసి, యజమానిగా మారారు. ఈ విషయాన్ని డిజిటల్ ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన జెట్ సింథసిస్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-క్రికెట్ వినోద లీగ్ అయిన GEPL, 300 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. దీని ప్రారంభ సీజన్ నుంచి లీగ్ మంచి వృద్ధిని సాధించింది. ఆటగాళ్ల ఆసక్తిలో ఐదు రెట్లు పెరుగుదలతో, సీజన్ 1లో 200,000తో పోలిస్తే 910,000 రిజిస్ట్రేషన్లకు చేరుకుంది.

గతంలో కూడా..

నిజానికి, సారా టెండూల్కర్ గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్లో “ముంబై గ్రిజ్లీస్” జట్టును కొనుగోలు చేసింది. ఇది 10 జట్లు పాల్గొనే గేమింగ్ లీగ్. ఈ జట్టు యజమాని అయిన తర్వాత సారా టెండూల్కర్ వెలుగులోకి వచ్చింది. సారా క్రికెట్‌కు పెద్ద అభిమాని కాగా, ఆమె తరచుగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు సపోర్ట్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె తండ్రి సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఆమె సోదరుడు అర్జున్ టెండూల్కర్ కూడా ప్రస్తుతం అదే జట్టులో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సారాకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు.

సారా ఏమన్నారంటే..

సారా టెండూల్కర్ ఈ విషయంపై మాట్లాడుతూ క్రికెట్ మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైందన్నారు. GEPLలో ముంబై ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడం ద్వారా తన కల నిజమైందన్నారు. ఈ ఆట పట్ల తనకున్న మక్కువను ముంబైతో కలిసి కొనసాగించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లతో లీగ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో GEPL సీజన్ 2 మరింత కొత్తగా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో జట్టు ఫార్మాట్‌లు, పోటీ స్థాయిలు, వ్యూహాత్మక, వాస్తవికతను మిళితం చేస్తూ కొత్త సవాళ్లను ప్రవేశపెట్టనున్నారు. రియల్ క్రికెట్ 24 ఆధారిత గేమ్‌ప్లేతో ఈ సీజన్ మరింత సూపర్‌గా మారనుంది.

గతంలో కూడా వార్తల్లో

సారా టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం కారణంగా గతంలో కూడా వార్తల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియాలో తన పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవల సచిన్ సారాకు ఒక పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఆమె సచిన్ టెండూల్కర్ ఓ ఫౌండేషన్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా సచిన్ సారా పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు సహాయం చేయడం, సమాజానికి తోడ్పడటం పట్ల ఆమెకు ఎప్పుడూ మక్కువ ఉందన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share