
*తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్పిన పెను ప్రమాదం*
భూ భారతి చట్టం- 2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లురవి, సంపత్ లు హెలికాప్టర్ కలెక్టరేట్ ఆవరణలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డిపై పడి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.