రాజన్న సిరిసిల్లలో ఏసీబీకి చిక్కిన అవినీతి మోసలి. •• ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఈఈ అమరేందర్ రెడ్డి •••

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

రాజన్న సిరిసిల్లలో ఏసీబీకి చిక్కిన అవినీతి మోసలి.

•• ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ ఈఈ అమరేందర్ రెడ్డి

••• అవునూర్ లో నిర్మించిన చెక్ డ్యాం బిల్లు కోసం 60 వేల రూపాయలు డిమాండ్.

•••లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

రాజన్న సిరిసిల్ల //మన ప్రజవాణి

ఓ అవినీతి అధికారి బిల్లు విడుదల కోసం లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల శాఖ ఈ ఈ ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) గా విధులు నిర్వహిస్తున్న అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, 75 వేలకు కుదురగా కరీంనగర్ లోని విద్యారణ్యపురి కాలనీలో నివాసం ఉంటున్న తన ఇంట్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు రవీందర్ వద్ద 60 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు అమరేందర్ రెడ్డిని పట్టుబడ్డాడు. అంతేకాకుండా గతంలోనూ ఇదే కాంట్రాక్టర్ వద్ద సుమారు నాలుగు లక్షల వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం.ఈ అధికారి చాలా మంది కాంట్రాక్టర్ల వద్ద అధిక మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share