👉అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

👉అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

👉 కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామంలో కేటీఆర్ సేన గ్రామ శాఖ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నియామకం జరిగింది.

నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా బాలసాని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బోణిగని మహిపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా చిట్యాల రాజశేఖర్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బట్కు అజయ్ యాదవ్, కార్యదర్శిగా మిడిదొడ్డి శ్రీకాంత్, కోశాధికారిగా రేగుల సురేందర్‌లను నియమించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన కేటీఆర్ సేనను బలోపేతం చేస్తూ, యువతలో చైతన్యాన్ని నింపే విధంగా పలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

నూతనంగా ఎన్నికైన కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులు బాలసాని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల కనకయ్య, సీనియర్ నాయకులు కురుమ రాజయ్య, మాజీ సర్పంచ్ అడ్డగట్ల భాస్కర్, తాజా మాజీ ఎంపీటీసీ కరికవేణి కుంటయ్య, సీనియర్ నాయకులు సావనపల్లి బాలయ్య, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Share