ఆరెగూడెం చెరువులో విష ప్రయోగం..? సుమారు రెండు టన్నుల చేపలు మృతి…!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఆరెగూడెం చెరువులో విష ప్రయోగం..?

సుమారు రెండు టన్నుల చేపలు మృతి…!

స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మత్స్యకారులు

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామం‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత పదార్థం కలపడంతో చెరువులోని చేపలు భారీగా మృతి చెందాయి. అంచనా ప్రకారం దాదాపు రెండు టన్నుల మేరకు చేపలు చనిపోయినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు.
ఈ ఘటనపై మత్స్య పరిశ్రమ సహకార సంఘం సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులో మృత చేపల సంఖ్య, వాటి విలువ చూసిన గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా గ్రామంలోని మత్స్యకారులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా ఇది మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని
ఎంతో ఆశతో చేపల వృద్ధికి శ్రమించామని ఒక్కసారిగా ఈ విధంగా నష్టం కలగడం క్షమించరానిదని సంఘ సభ్యులు అన్నారు.ఈ ఘటన పునరావృతం కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. కాగా నీటిమట్టం తక్కువగా ఉండటంతో చేపలు చనిపోయినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share