
*మండల పరిషత్ నిధులతో హనుమాన్ గుడి వద్ద బోరు వేయించిన ఫాజుల్ నగర్ వైస్ ఎంపీపీ:జక్కుల కవిత తిరుపతి*
*మన ప్రజావాణి//వేములవాడ,మే - 24*
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో ఎంపీటీసీ మండల పరిషత్ నిధుల ద్వారా వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి సహకారంతో గ్రామ హనుమాన్ దేవాలయం వద్ద బోరు వేయడం జరిగింది.గ్రామ ఎంపిటిసి గా గతంలో సిసి రోడ్లు మరియు ఐమాక్స్ లైట్లు సిసి రోడ్డు నిర్మాణాలు సుమారుగా 30 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది దీంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు సహకరించిన వైస్ ఎంపీపీ జక్కుల కవితా గార్లకు హనుమాన్ సేవా సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గుడి వద్ద చాలామంది హనుమాన్ భక్తులు దీక్ష చేపట్టడం జరుగుతుంది వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరియు అలాగే గుడి ప్రాంగణం శుభ్రంగా ఉండటానికి బోరు సాంక్షన్ చేయడం జరిగింది15వ ఫైనాన్స్ మండల పరిషత్తు ద్వారా రెండు లక్షల రూపాయలు బోరు మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి గ్రామ శాఖ చిందం కుమార్ కుమారస్వామి గంగులప్రసాద్ అరుణ్ కుమార్ రాకేష్ ఎగుర్ల రాజు మధు పరశురామ్ మరియు కుల సంఘాల పెద్దలు గ్రామ ప్రజలందరూ మహిళలు పాల్గొనడం జరిగింది
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025