
“ఫిర్యాదుధారుని కుటుంబ సభ్యులకు చెందిన భూమికి హక్కుధారుల ధ్రువీకరణ పత్రాన్ని జారిచేయటానికి, తహసీల్దారు గారికి ఆ భూ సంబంధిత స్థల చిత్రపటాన్ని పంపించడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.7,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా కడెం మండలపు తహసీల్దారు వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ – పవార్ ఉమాజీ.
ఇతను ముందుగా రూ.25000/- #లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుధారుని అభ్యర్ధన మేరకు లంచాన్ని రూ.20,000/- తగ్గించి, అందులో తేది.20.05.2025 నాడు రూ.12000/- #లంచం తీసుకున్నాడు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును