
జిల్లాలో పిడుగుపాటుతో యువకుడి మృతి
••••రుద్రవరం గ్రామంలో విషాదఛాయలు
రాజన్న సిరిసిల్ల //మన ప్రజావాణి
పిడుగుపాటుతో యువ గొర్ల కాపరి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే.... వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్ (26) అనే యువ గొర్లకాపరి మంగళవారం రోజు పిడుగుపాటుతో ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జరిగింది. లక్ష్మణ్ తలపైన పిడుగు పడడం తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025