
మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో చిక్కుకున్న
ఖమ్మం ఫైళ్ళు...?
చిన్న బుచ్చుకున్న మత్స్యకారులు...?
ఓ సంఘం అధ్యక్షుడు కార్యదర్శి నాలుగు లక్షల రూపాయల అవినీతి ఫైలు..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముదిరాజు బిడ్డలకు న్యాయం చేయకపోగా మరి కొంతమంది సాకు చూపి...?
ఏళ్లకు ఏళ్ళుగా పెండింగ్ లో పెట్టటం న్యాయమేనా...?
ఇంతకీ... కమిషనర్ కార్యాలయంలో న్యాయం దక్కేనా...?
వారసత్వ మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేనా...?
మన ప్రజావాణి ప్రత్యేక కథనం...4
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
శివుడు ఆజ్ఞలు లేనిది చీమైనా కుట్టదు. ఓ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి త్రవ్వినాకొద్దీ వెలుగు చూస్తోంది. ఆ మూడు గ్రామాల మత్స్యకారుల వారసత్వ హక్కులు కాసులకు కక్కుర్తి పడి కొందరు జిల్లా మత్స్య శాఖ అధికారుల పర్యవేక్షణలో అండదండలతో సుమారు 200 ఎకరాల లోపు ఉన్న చెరువులో అవినీతి రాజ్యమేలుతుంది. ఆ చెరువులో పంచ పాండవులు మాదిరిగా కొందరు వ్యవహరిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 20 సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ చేపల వృత్తిని చేయని వారిని తమ పలుకుబడి పరపతి కాసులు విసిరి సభ్యులుగా నమోదు చేశారు. ఆ తరువాత మారిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కొందరు వృద్ధాప్యంలో రోగాల బారిన పడి ఇతర కారణాల వలన మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం కాస్త తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క సభ్యులు చొప్పున అర్హులుగా ప్రభుత్వం జీవో జారీచేసి అమలు చేస్తున్న నేపథ్యంలో కొందరు అవినీతి అధికారులు మత్స్య పారిశ్రామిక సంఘంలోని పెత్తనం చలాయించే అధ్యక్షులు కార్యదర్శులు ఇష్టానుసారంగా వ్యవహరించి వేలాది రూపాయలు కొల్లగొట్టి చేపలు వృత్తితో సంబంధం లేని వారిని సభ్యులుగా చేర్చి చివరకు చేపల వేట సాగించే సమయంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉండటంతో అర్హతలు కలిగిన వారసత్వ సభ్యులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇస్తే తీసుకుంటారు లేదంటే దౌర్జన్యం చేస్తూ ఏళ్లకు
ఏళ్లుగా మత్స్యకారుల నోటికాడ ముద్దను లాగేసుకుంటూ చలామణి కావటం విశేషం. మన ప్రజావాణి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి వీరభద్రం సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి పెద్ద చెరువు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గత 20 సంవత్సరాలుగా అక్రమార్కులు దళారులు పాలకవర్గాల చేతుల్లో బంధీగా మారింది. చేపలు వృత్తితో సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చెలాయిస్తూ చేపల చెరువు తమ జాగీరుగా మార్చుకొని కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి మత్స్యకారులను నట్టేట్లో ముంచుతున్న వైనం అత్యంత దుస్థితిని తెలియజేస్తుంది. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు ఉన్న ఇదే తీరుగా వ్యవహరిస్తూ అర్హులైన మత్స్యకారులను బైల ప్రకారం నమోదు కాకుండా సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్న దుస్థితి. ఖమ్మం జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ తతంగం జరగటం విశేషం. గాంధీనగర్ కాలనీ సమీపంలోని ఓ కుంటలో కూడా అదే విధంగా అనంతసాగర్ రెవిన్యూ లోని మరో కుంటలో పంచ పాండవులు మాదిరిగా కొందరు వ్యవహరిస్తూ తమ గుప్పెట్లో బందీ చేసి ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ అపహాస్యం చేస్తున్నట్లు పలువురు మత్స్యకారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రతి ఏడాది జరిగే తంతు నేటికి కూడా కొనసాగటం మత్స్య పారిశ్రామిక సంఘం ఆదిపత్యాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి నుండి నేటి వరకు పాలకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ కొందరు మత్స్యకారులు తమ వారసులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయించుకొని పబ్బoగడుపుతున్నట్లు ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని ఏళ్ల క్రితం నుండి ఇటీవల కొందరు అర్హులైన మత్స్యకారులు రకరకాల కారణాలతో మృత్యువాత పడిన నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సుమారు 40 మంది అర్హులుగా అధికారులకు తెలిసినప్పటికీ ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారసులను అడ్డుగా చూపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు జిల్లా మత్స్యకారులను సైతం ఆరోపిస్తున్నారు. సభ్యత్వాల నమోదు కోసం 6000 8000 10,000 రూపాయల చొప్పున సుమారు నాలుగు లక్షల రూపాయలు పందిళ్ళపల్లి మత్స్యపాల్సిన సంఘం అధ్యక్షుడు కార్యదర్శి పాలకవర్గం బహిరంగ విచారణలో తేలడంతో జిల్లా మత్స్య శాఖ అధికారి తదుపరి చర్యల కోసం కమిషనర్ కార్యాలయానికి 10/3/2025 న రెండు నివేదికలు తయారుచేసి పాలకవర్గం అధ్యక్షులు కార్యదర్శి అవినీతి అక్రమాలు రుజువైనట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో నివేదికలో అర్హులైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సుమారు 34 మంది సభ్యత్వాలకు అర్హులని తేలుస్తూ నివేదిక పంపించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్నారు. అనంతరం కొందరు మృతి చెందినట్లు గత 10 సంవత్సరాల క్రితం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన తూటిపల్లి వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు క్యాన్సర్ తో బాధపడుతూ2015 ఆగస్టు నెలలో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం కాసులు అడిగితే ఇవ్వలేదని కారణంతో కుటుంబాల మధ్య చిచ్చులు రాజేసి కనీసం పదేళ్లు గడిచిన మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో ఆ సమాచారాన్ని చెలియ పర్చకుపోవడం విశేషం. సుమారు 20 సంవత్సరాల క్రితం ఓ అధ్యక్షుడు అవినీతికి పాల్పడి మత్స్యకారులను గుల్ల చేస్తున్న వైనంపై నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయిలో సదరు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో నాడు విచారణ చేసి కోపరేటివ్ యాక్ట్ ప్రకారం చర్యలకు అధికారులు దిగిన సంగతి జిల్లా మత్స్యకారులకు గుర్తుండే ఉంటుందని తెలుస్తోంది. కాగా గత 20 సంవత్సరాల నుండి చేపల చెరువులో అవినీతి తిమింగలాలు ప్రతి ఏడాదికి ఏడాది బలపడి విస్తరించి నాటి తరం మత్స్యకారులు చనిపోవడంతో వారి వారసులు చేపల చెరువులో నమోదు కాకుండా అడ్డుపడుతూ కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్లు మన ప్రజావాణి పరిశీలనలో తేలింది. ఇప్పటికైనా సంబంధిత రాష్ట్ర కమిషనర్ నివేదికలు ఆధారంగా పాలకవర్గం ను రద్దుచేసి ప్రభుత్వ నిబంధనలప్రకారం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారుల కు చేపల సభ్యత్వం తక్షణమే కల్పించి ఆదుకోవాలని సింగారపు వీరమల్లు సింగారపు వీరభద్రం లింగం నాగేశ్వరరావు వీరభద్రం సింగారపు వీరాంజనేయులు కోరుతున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025