ఓ అధికారి అండదండలతో కోదాడలో విచ్చలవిడిగా మట్టి రవాణా…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఓ అధికారి అండదండలతో కోదాడలో విచ్చలవిడిగా మట్టి రవాణా…?

వెంచర్లకు 24 గంటలు సరఫరా చేస్తున్నా మట్టి మాఫియా..?

ఒక్కొక్క ట్రిప్పుకు 700 నుండి 1000 రూపాయలు వసూళ్లు..?

అనుమతులు లేవు అంటున్నా కోదాడ తహసిల్దార్
సిబ్బందిని పంపించి అడ్డుకుంటామని వివరణ

యధావిధిగా రోజులుగా కొనసాగుతున్న తతంగం

ఖమ్మం -కోదాడ ప్రధాన రహదారిపై తమ్మర వద్ద మట్టి రవాణా..?

స్టేట్ బ్యూరో మన ప్రజావాణి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సమీపంలోని తమ్మర పరిధిలో రైస్ మిల్ గ్యాస్ కంపెనీ సమీపంలో ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై గత కొన్ని రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో విచ్చలవిడిగా అక్రమ మట్టి రవాణా కొనసాగుతోంది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి వేళల్లో కూడా నిరంతరాయంగా మట్టి రవాణా జరుగుతున్న సంబంధిత మైనింగ్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగాలు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ శాఖ అధికారి అండదండలతో పర్యవేక్షణలో మట్టి అక్రమ రవాణా జరుగుతుందని నిర్వాహకులు వ్యాఖ్యానించటం విశేషం. ఏదైనా మట్టి అనుమతులు తీసుకోవాలంటే తప్పనిసరిగా మైనింగ్ అధికారుల నుండి దృవీకరణలు పొందాల్సి ఉండగా అటువంటివి ఏమీ లేకుండా గత కొన్ని రోజులుగా వెంచర్లకు ఇతర ప్రైవేటు భూమి అభివృద్ధి పనులకు బహిరంగంగా ప్రధాన రహదారిపై మట్టి అక్రమ రవాణా జరగటం విశేషం. మరోవైపు ట్రాక్టర్లతో ఇసుకను అక్రమార్కులు ఓ జాతర మాదిరిగా ప్రధాన రహదారిపై నిత్యం తరలిస్తున్నట్లు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఓ శాఖకు చెందిన అధికారి కనుసైగాలతో గత కొంతకాలంగా విచ్చలవిడిగా కోదాడ ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మన ప్రజావాణి ప్రతినిధి స్థానిక కోదాడ తహసిల్దార్ ను వివరణ కోరగా ఆ శాఖ అధికారులకు సంబంధం ఉండాలని ఏ లొకేషన్ లో ఎక్కడ జరుగుతోంది అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సిబ్బందిని పంపించి అడ్డుకుంటామని తహసిల్దార్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యధావిధిగా అక్రమ మట్టి రవాణా జోరుగా కొనసాగటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share