రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అద్దె ఎవరి ఖాతాలో చేరుతున్నది..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అద్దె ఎవరి ఖాతాలో చేరుతున్నది..?

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సమాధానం చెప్పాలి

భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్

మంథని: మన ప్రజావాణి జూన్ 10
పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు ఎదురుగా నిర్మించిన రిటైర్డ్ పెన్షనర్స్ భవనం ఎవరి ఆధీనంలో నిర్వహించబడుతుందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్లా శివకుమార్ ప్రశ్నించారు. రిటైర్డ్ పెన్షనర్స్ భవనం నిర్వహణ వలన రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలోని ఎంతమంది నాయకులు లాభపడుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ నాయకులను సూటిగా ప్రశ్నించారు.ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేశారా? లేక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని నిర్మించారో తెలియదు కానీ పేరుకు మాత్రమే రిటైర్డ్ పెన్షనర్స్ భవనంగా కొనసాగుతున్నదని అన్నారు. అందులో కొనసాగేది మాత్రం ప్రైవేటు వ్యక్తుల సొంత లాభాల వ్యాపారం అని మండిపడ్డారు.
రిటైర్డ్ పెన్షనర్స్ పేరుతో ఏర్పాటు చేసిన భవనాన్ని రిటైర్డ్ పెన్షనర్స్ అవసరాల కోసం ఉపయోగించకుండా ప్రైవేట్ వ్యక్తులకు కిరాయికి ఇచ్చి కిరాయి ద్వారా వచ్చే సొమ్మును రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం లోని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు తమ సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.రిటైర్డ్ పెన్షనర్స్ భవనం దూర ప్రాంతాల నుంచి వచ్చే పెన్షనర్స్ కు ఉపయోగపడడం లేదని అన్నారు. సంఘంలో సభ్యత్వం పొందిన రిటైర్డ్ ఉద్యోగులు తమ అవసరాలరీత్యా మంథని పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. మంథని చౌరస్తాలోనే ఏదో ఒక హోటల్లో తమ పెన్షన్ కు సంబంధించినటువంటి దరఖాస్తులను నింపుకొనే దుస్థితి ఉందని అన్నారు. ఏదో ఒక నీడన తమ కాగితాలను సరిచూసుకొని సంబంధిత ఆఫీసులో అప్పగించి అలసటతో వెనుతిరిగి వెళ్తున్నారని అన్నారు. రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు రిటైర్డ్ ఉద్యోగస్తుల నుండి ప్రతి సంవత్సరం సభ్యత్వ రుసుము వసూలు చేసినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో మాత్రం కూర్చునే అదృష్టాన్ని ఎందుకు కలిగించడం లేదని నిలదీశారు. అంతేకాకుండా రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని ఇతర వ్యక్తులకు కిరాయి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులను కూడా సంఘం యొక్క అవసరాలకు గానీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గానీ ఉపయోగించడం లేదని అన్నారు. సంఘ భవనం కిరాయి ద్వారా వచ్చే డబ్బులను సంఘంలోని కొంతమంది నాయకులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని సంఘంలోని కొంతమంది విశ్రాంత ఉద్యోగస్తులు వాపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో ఒక గదిని రిటైర్డ్ పెన్షన్ దారులు తమ కనీస అవసరాల కోసం ఉపయోగించుకునేలా తయారు చేయాలని కోరారు. రిటైర్డ్ పెన్షనర్లు అందులో వారికి కావలసిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారనీ తెలిపారు. విశ్రాంత ఉద్యోగస్తులకు ఉపయోగపడని రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని పూర్తిగా మూసివేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘంలో సభ్యత్వం పొందిన కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు తమలో తామే చర్చించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share