చెరువు శిఖం భూమి ఆక్రమణ..! బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…? చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

చెరువు శిఖం భూమి ఆక్రమణ..!

బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…?

చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..?

ఎంత బడా బాబు అయితే మాత్రం.. ఇదేం నిర్వాకం..?

మరో పంచాయతీ కార్యదర్శి కారు చౌకగా చెరువును లీజుకి ఇస్తారు ఇక్కడ…?

ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఈ అక్రమాల మాటేమిటి…?

అసహనం వ్యక్తం చేస్తున్న రెండు గ్రామాల ప్రజలు

మన ప్రజావాణి “ప్రత్యేక” వరుస కథనం…1

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చెరువు శిఖం భూమిని సుమారు నాలుగు ఎకరాలు ఆక్రమించి దర్జాగా ఈ ఏడాది సాగు చేసుకునేందుకు కట్టలు పోపించి రంగం సిద్ధం చేసిన వ్యవహారం ఆ మండలంలో సంచలనంగా మారింది. స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి పోరాడిన నాటి బడా బాబు నేడు తన గ్రామానికి సమీపంలోని ఓ చెరువును ఆక్రమించి సుమారు నాలుగు ఎకరాలను గుప్పెట్లో పెట్టుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయంటూ ఏకంగా చెరువులో సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవహారం పరిసర గ్రామాలలో కలకలం రేపింది. స్వతంత్ర సంగ్రామంలో తనతో పాటు కొందరు పాల్గొన్నారని వారికి కూడా తనకున్న పరపతి పలుకుబడితో పెన్షన్లు మంజూరు అయ్యేటట్లు ప్రయత్నం చేసిన బడా బాబు ఓ మండల కేంద్రంలో మూడు నివాస గృహాలతో పాటు మరో నివాసగృహాన్ని నిర్మిస్తున్న ఘనుడు. అయినప్పటికీ తీసుకున్నది ప్రభుత్వ పెన్షన్ అయిన ఆదర్శంగా ఉండాల్సిన ఆ బడా బాబు రెండు గ్రామాలకు చెరువు ద్వారా సాగుకు ఉపయోగపడే చెరువును తన కబంధ హస్తాలలో బందీ చేసి నాలుగు ఎకరాలను స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేయటం అధికారుల పనితీరును తెలియజేస్తుందని పలువురు సన్నా చిన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వం చెరువులు కుంటలు ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో ఆ బడా బాబు చేసే నిర్వాకంతో ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుందని పలువురు రైతులు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ గ్రామపంచాయతీలోని చెరువును ఒకవైపు బడా బాబు ఆక్రమించి హస్త గతం
చేసుకుంటుంటే.. మరోవైపు ఆ చెరువును నామమాత్రం ధరకు సుమారు 20వేల రూపాయలకు చెరువును గుప్పెట్లో పెట్టారు. గతంలో కూడా సదరు వ్యక్తికి చేపలకు లీజుకు ఇచ్చినట్లు అదే వ్యక్తికి మళ్లీ సదరు పంచాయతీ అధికారులు కట్టబెట్టినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి.

మరికొన్ని అంశాలతో.. రెండవ
ఎపిసోడ్లో వేచి చూడండి…!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share