*జిల్లాతో నాకెంతో ప్రత్యేక అనుబంధం* *సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్య*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*జిల్లాతో నాకెంతో ప్రత్యేక అనుబంధం*

*సంగారెడ్డి కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్య*

*హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం*

హనుమకొండ జిల్లా ప్రతినిధి //మన ప్రజావాణి

హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా పని చేసిన ఈ ప్రాంతం తనకేంతో ప్రత్యేకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న పి.ప్రావీణ్య అన్నారు.ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న పి.ప్రావీణ్య ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన బెంగళూరు తర్వాత ఎక్కువ కాలం ఉన్న ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. జీవితంలో ఈ ప్రాంతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. మున్సిపల్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా అందరి సహకారంతో సమన్వయంతో పనిచేయడం పట్ల జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు క్రమం తప్పకుండా అధికారులతో సమావేశాలను నిర్వహించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉండడంతో తరచుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఎక్కువ సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని విజయవంతంగా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు, సమావేశాలు అధికారులు, ఉద్యోగులతో విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వ పథకాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో అందరి సహకారం ఉందన్నారు.
తన దృష్టికి ఏ విషయం వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదన్నారు. మున్సిపల్ కమిషనర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ గా దీర్ఘకాలం పనిచేసిన ఈ ప్రాంతాన్ని జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని అన్నారు. ఎక్కడ ఉన్నా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. పరిపాలనలో జిల్లా ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, నాయకులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో నిలిపేందుకు కలెక్టర్ ప్రావీణ్య ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయా శాఖలను, అధికారులు, ఉద్యోగులను ముందుకు నడిపించారని అన్నారు.ఆత్మీయ వీడ్కోలు సమావేశం అనంతరం వివిధ శాఖల అధికారులు, టీజీవో, టీఎన్జీవో, వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గజమాలలు, పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, టీఎన్జీవో అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఇతర సంఘాల నాయకులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share