
*హుజూర్నగర్లో ఏసీబీ దాడులు…*
*తాసిల్దార్ ఆఫీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం తీసుకుంటూ పట్టుబాటు!*
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి కలకలం రేపింది. అధికారులకు లంచం ఇస్తూ పట్టుబడిన ఘటన చోటుచేసుకుంది. అనుమతుల జారీ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ కర్నాటి విజేత రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.12,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయాన్ని చిత్రీకరించి, ఆధారాలతో సహా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, సంబంధిత శాఖలో అవినీతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అధికారుల అవినీతిపై ఏసీబీ చురుకుగా వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025