నాప్స్కాబ్ డైరెక్టర్ గా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నియామకం* *జాతీయస్థాయిలో కోఆపరేటివ్ వ్యవస్థలో కీలక భూమిక పోషించనున్న చైర్మన్*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*నాప్స్కాబ్ డైరెక్టర్ గా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నియామకం*

*జాతీయస్థాయిలో కోఆపరేటివ్ వ్యవస్థలో కీలక భూమిక పోషించనున్న చైర్మన్*

*కుంభంకు పలువురు శుభాకాంక్షలు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 13 (మన ప్రజావాణి)*:

గత ఏడాది కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర ( డిసిసిబి ) బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తున్న కుంభం శ్రీనివాస్ రెడ్డి నాఫ్స్కాబ్ ( నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ) డైరెక్టర్ గా నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం నాడు నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రగతి బాటలో పయనింపజేసేలా డి సి సి బి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. ఢిల్లీ కేంద్రంగా ఉండే నాప్స్కాబ్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రైతుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలలో డిసిసిబి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ సాయి డైరెక్టర్ గా ఇకనుంచి కీలక భూమిక పోషించనున్నారు. డిసిసిబి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నుండి కుంభం శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ను 3 వేల కోట్ల టర్నోవర్ కు తీసుకువెళ్లారు. అదేవిధంగా ఇటీవల లండన్ లో జరిగిన అంతర్జాతీయ కో-ఆపరేటివ్ సదస్సులో నాలుగు రోజులపాటు రాష్ట్రం తరఫున పాల్గొన్నారు. ఆయా దేశాలలో కో-ఆపరేటివ్ బ్యాంకుల తరఫున జరుగుతున్న సంక్షేమ పథకాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం కోసం ప్రణాళికలను రూపొందించారు.
వినయ, విధేయతలే ఆయనకు వరం. మారుమూల ప్రాంతమైన మునుగోడు మండలం కల్వకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరి తో వినయ, విధేయత ఉంటూ తన జీవన కొనసాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ప్రభుత్వ పాఠశాలలకు కాలినడక నడిచి వెళ్లి విద్యను అభ్యసించి కొన్ని సంవత్సరాల పాటు జర్నలిస్టు గా పనిచేశాడు. ఆ పాత్రికేయ వృత్తి తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. తనకు పరిచయమైన వారితో స్నేహంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను తీసుకునేవాడు. దాంతో ఓ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ రెడ్డి అందరి ఆత్మ బంధువు, మనసున్న మహారాజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన 2009లో శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలకు వచ్చి రాజగోపాల్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ ఆయన సూచనల ప్రకారం రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మునుగోడు పిఎసిఎస్ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 13 డైరెక్టు స్థానాలకు 12 స్థానాలు తానే గెలిపించుకొని మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. అంతేకాకుండా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఏకైక డిసిసిబి డైరెక్టర్గా కూడా ఎన్నికయ్యాడు. గత ఏడాది క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఎన్నికై రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలా ఆధారంగా ఆయనను జాతీయస్థాయిలో నాప్ స్కాబ్ డైరెక్టర్ గా నియమించడం పట్ల పాలకవర్గ డైరెక్టర్ల తోపాటు, అధికారులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాఫ్స్కాబ్ డైరెక్టర్గా నూతనంగా నియమించబడిన కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనను నియమించిన మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ పదవితో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జాతీయస్థాయిలో కో-ఆపరేటివ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉత్తంకుమార్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్* *మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు.* *… జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 22 (మన ప్రజావాణి)*: గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెర నుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయం తో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు* . వడ్త్య జవాహర్ లాల్ తండ్రి రాములు, వయస్సు: 50 సం.లు, నివాసం : బనాలకుంట గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. రామవత్ రమేష్ తండ్రి లక్పతి , వయస్సు: 24 సం.లు,నివాసం : పాయ తండా గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. మైలపల్లి శివ తండ్రి దేవుడు, వయస్సు: 30 సం.లు, నివాసం : ఇంటి నెంబర్. 4-45 వాడపాలెం గ్రామం, రాంబిల్లి మండల్, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. కారే సింహా చలం తండ్రి: సింహా చలం, వయస్సు: 39 సం.లు, నివాసం : బంగారమ్మపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, వయస్సు: 26 సం.లు, నివాసం : అమలాపురం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, వయస్సు: 45 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. చాపల తాత రావు తండ్రి: సోమరాజు, వయస్సు: 38 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ. చాపల బంగారి తండ్రి: బంగారి వయస్సు: 39 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. *నమోదైన కేసుల వివరాలు* : క్రైమ్. నెంబర్.66/2025 యు/ఎస్ 143(4), 146 బి ఎన్ ఎస్ సెక్షన్. 79 ఆఫ్ జె జె యాక్ట్ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ , క్రైమ్ నెంబర్. 68/2025 యు/ఎస్ 146 బి ఎన్ ఎస్ సెక్షన్.18 ఆఫ్ బిఎల్ఎస్ఎ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్. 69/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ పి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్.117/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.18 బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ గుడిపల్లి, క్రైమ్. నెంబర్.118/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 ఆఫ్ జె జె యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పి ఎస్ గుడిపల్లి *కేసు వివరాలు* పైన తెలిపిన నిందితుల లో గుడిపల్లి కి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్, శివ లు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది. మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేశ్, వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఈ ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు, గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్, చైల్డ్ లైన్ , సి డబ్ల్యూ సి బృందం, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.‌ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 నోటిఫికేషన్స్

 Share