మీ పిల్లలకు ఒక పాస్వర్డ్ చెప్పండి ••• ఢిల్లీలో ఆ పాస్వర్డ్ వల్లే తప్పించుకున్న విద్యార్థి. ••• పోలీసులకు చిక్కిన కిడ్నాపర్.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

మీ పిల్లలకు ఒక పాస్వర్డ్ చెప్పండి

••• ఢిల్లీలో ఆ పాస్వర్డ్ వల్లే తప్పించుకున్న విద్యార్థి.

••• పోలీసులకు చిక్కిన కిడ్నాపర్.

//మన ప్రజావాణి ///

స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం. డిల్లీ లోని ఒక స్కూల్ లో తల్లి చెప్పిన పాస్వర్డ్ వల్లే విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్న జరిగిన సంఘటన.ఢిల్లీ లో ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి ని తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది.కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది.
దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి , ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి “మీ అమ్మకు వేరే అర్జంట్ వర్క్ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది “ అని ఆ అమ్మాయితో చెప్పాడు.వెంటనే ఆ అమ్మాయి, “సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని, నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్ వర్డ్ చెప్పు“ అని అడిగింది.వాడికేమీ అర్థం కాలేదు…అటూ ఇటూ చూసి తడబడ్డాడు.ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై, గట్టిగా అరిచే లోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి, స్కూల్ పిల్లల కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతుండటంతో, ఆ అమ్మాయి తల్లి, తన కూతురికి ఒక పాస్ వర్డ్ ను చెప్పింది.స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే, వాళ్ళను ఆ పాస్ వర్డ్ ను అడగమని చెప్పింది.అప్పుడు ఆ పాస్ వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే, కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల, ఆ అమ్మాయి కిడ్నాపర్ ల బారి నుండి తప్పించుకోగలిగింది.తల్లిదండ్రు లందరూ తమ పిల్లలకు ఈ పాస్ వర్డ్ విధానాన్ని పాటిస్తే చాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు.ఇది మికు కూడా ఉపయోగపడుతుందని *మన ప్రజావాణి* ఆరాటం. మనం లేని సమయంలో కూడా ఆ పాస్వర్డ్ రక్షించగలుగుతుందని మాయొక్క సూచన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share