*కోరుట్ల కోర్టు జడ్జి నారం అరుణ్ కుమార్ ఏపీపీ ప్రణయ్ కు ఘన సన్మానం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*కోరుట్ల కోర్టు జడ్జి నారం అరుణ్ కుమార్ ఏపీపీ ప్రణయ్ కు ఘన సన్మానం*

కోరుట్ల,జులై 30(ప్రజావాణి)
కొరుట్ల బార్ అసోసియేషన్ చరిత్రలో మరొక అద్భుత ఘట్టం నమోదైంది. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడగా,కోరుట్ల కోర్టు ఇంచార్జి జడ్జి నారం అరుణ్ కుమార్ విశేష మెజారిటీతో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గెలుపొందడం గొప్ప గర్వకారణం.అదే సందర్భంలో,తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల సంఘం ఎన్నికల్లో,కోరుట్ల కోర్టు ఇంచార్జి ఏపీపీ ప్రణయ్ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు.వారి ఇరువురి విజయాలు కోరుట్ల న్యాయవాద కుటుంబానికి మరొక గౌరవాన్నిచ్చాయి అని కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇరువురు అధికారులను ఘనంగా సన్మానించడమైంది.ఈ సందర్భంగా న్యాయమూర్తి నారం అరుణ్ కుమార్ మాట్లాడుతూ “న్యాయవ్యవస్థ పట్ల నాలో ఉన్న నిబద్ధతను గుర్తించి అప్పజెప్పిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా, న్యాయసేవల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను,అని అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, ఖజానాదారు ప్రేమ్,స్పోర్ట్స్ సెక్రటరీ సుతారి నవీన్ కుమార్,సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కడకుంట్ల సదాశివరాజు,గోనే సదానంద్ నేత,జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఊరడి నరేందర్,లైబ్రరీ సెక్రటరీ మరిపల్లి గంగాధర్ సీనియర్ న్యాయవాదులు ముబీన్ పాషా,బోయిని సత్యనారాయణ,తోకల రమేష్ ,జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share