
టి.డబ్ల్యూ.జే.ఏ.రాష్ట్ర అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ ను పరామర్శించిన
మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలివేరి లక్ష్మీరాజం
కోరుట్ల,జూలై 30 (ప్రజా వాణి) తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు టైగర్ అలీ నవాబ్ అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకొని మన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలివేరి లక్ష్మీరాజం అలీ నవాబ్ ఇంటికి వెళ్లి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చి పరామర్శించారు.బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రం లోని ఆలీ నవాబ్ నివాసంలో మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలివేరి లక్ష్మీరాజం ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని సమయానికి మాత్రలు వేసుకొని వైద్యుల సూచన మేరకు ఆహారం తీసుకోవాలని ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టైగర్ అలీ నవాబ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఉన్నప్పటికీ తనకు ఇల్లు రాకుండా అనేకమంది అడ్డుకోవడం ద్వారా ఇంటి అద్దె పిల్లల ఖర్చులు ఆర్థిక భారం ఎక్కువై నా పిల్లలకు పెళ్లి సంబంధాలు కూడా సొంత ఇల్లు లేకపోవడంతో ఎవరు చేసుకోవడానికి ముందుకు రావడం లేదని ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆలోచించడం ద్వారా నాకు మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం భారీ నుండి బయటపడ్డానని ఇప్పటికైనా నాయకులు సంబంధిత పాత్రికేయులు రాజకీయాలు పక్కకు పెట్టి అర్హులైన సీనియర్ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని మెట్పల్లి పాత్రికేయులకు కోరుట్లలో ఇవ్వడం ద్వారా ఇరు పట్టణాల పాత్రికేయుల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని కోరుట్లలో అర్హులైన సీనియర్ జర్నలిస్టులను పక్కకు పెట్టేసి మెట్పల్లిలో చాలా ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ వారికి కోరుట్ల పట్టణంలో చాలామందికి కోరుట్లలో ఇల్లు తీసుకోవడం ఇష్టం లేనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పట్టుబట్టి మెట్పల్లి ప్రాంతం వారికి కోరుట్లలో ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ఇప్పటికైనా నాయకుల, కొంతమంది పాత్రికేయుల స్వలాభం రాజకీయాలు పక్కన పెట్టి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని టైగర్ అలీ నవాబ్ స్పష్టం చేశారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025