ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అరకొరగా పరీక్షలు..? మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటి బాట పడుతున్నా సిబ్బంది..!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అరకొరగా పరీక్షలు..?
మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటి బాట పడుతున్నా సిబ్బంది..!

జిల్లా కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని బాధితుల మొర..?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో కొందరు సిబ్బంది నిర్వాకం వలన మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించి ఆ తరువాత పరీక్షల కేంద్రాలకు తాళాలు దర్శనం ఇవ్వడం తో బాధితులు బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాల నుండి వందలాది మంది నిత్యం వైద్యసేవలకు ప్రధాన ఆస్పత్రికి వస్తూ పోతూ ఉంటారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసే కొన్ని కేంద్రాలు తాళాలు దర్శనం ఇవ్వడంతో రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పాత బిల్డింగ్ మరియు కొత్త బిల్డింగ్ లో కూడా ఐ సి టి సి విభాగానికి తాళాలు దర్శనం ఇవ్వడంతో రోగులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ స్పందించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు బంధువులు కోరుతున్నారు. నిత్యం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సుమారు 1500 నుండి 2000 వరకు వివిధ వైద్య సేవలు పొందేందుకు బాధితులు సుదూర ప్రాంతాల నుండి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నట్లు ఆ మేరకు పరీక్షలు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసీజీ ఇతర కొన్ని పరీక్షల వద్ద మహిళా సిబ్బంది లేకపోవడంతో కొందరు మహిళ రోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share