
*బిఆర్ఓయూ లో అడ్మిషన్ ఈనెల 30 చివరి గడువు*
*అడ్మిష ప్రక్రియలో ఉమ్మడి నల్లగొండ ను ప్రథమ స్థానంలో ముందుచాలి*
*జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్*
*నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 18 (మన ప్రజావాణి)*:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అతి తక్కువ పీజుల తో అడ్మిషన్లు పొందెందుకు ఈనెల 30 వ తేదీ చివరి గడువు ఉందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండ లోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ అతి తక్కువ పీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించిని ఉన్నత విద్యను కేవలం బిఆర్ఓయు లో బిఎ, బికాం, బిఎస్ సి, ఎంఏ, ఎంకాం, ఎం ఎస్ సి, డిప్లొమా కోర్సులలో చదువుకునేదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం యూనివర్సిటీ వి సి డాక్టర్ గంట చక్రపాణి తీసుకున్న నిర్ణయంతో సమత’ ఫ్రీషిప్లు నిపుణ ఫెలోషిప్లు ఇవ్వబోతున్నామన్నారు. సమత ప్లీషిప్ ఆదివాసీలు, ప్రాచీన గిరిజనులు, ట్రాన్స్ జెండర్ ప్రజలు, శారీరక వికలాంగులు దివ్యాంగులకు ఉచిత విద్యను అందించబోతున్నాంఅని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో ఏ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. దీనివల్ల తెలంగాణలో ట్రాన్స్ జెండర్ తోపాటు దివ్యాంగులు, గోండు కోయ, చెంచు ఆదివాసులు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిదంగా వివిధ కారణాల చేత తమ విద్యను మధ్యలో వదిలేసిన వారు, ముఖ్యంగా గృహిణిలు, ఉద్యోగస్తులు అదేవిదంగా ఉన్నత విద్యను అభ్యసించలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా యూనివర్సిటీ అందిస్తున్నటువంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటెర్మీడియేట్ లేదా రెండు సంవత్సరాలు ఐటిఐ, ఓపెన్ ఇంటర్, 10+2 కోర్సు చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చన్నారు. వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకొని మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు. సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకున్న తరువాత ట్యుషన్ ఫీజు చెల్లించవచ్చన్నారు. బిఎ. బికాం. బిఎస్ సి ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. డిగ్రీ, పీజీ రెండవ, మూడోవ సంవత్సర విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. అడ్మిష ప్రక్రియలో ప్రతి సంవత్సరం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందని అదే స్ఫూర్తిని అందరు కొనసాగించి అత్యధికమంది అరులైన వారు అడ్మిషన్ చేసుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశం లో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, ఎన్ జి కాలేజీ అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవి,రాజారామ్ పున్న అంజయ్య,ఉన్నారు.