*మున్సిపల్ క్వార్టర్స్ నోటీస్ లు వెనక్కి తీసుకోవాలి *నివాసం వున్న వారికే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి – వై విక్రమ్* *సానుకూలంగా స్పందించిన కమిషనర్…*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*మున్సిపల్ క్వార్టర్స్ నోటీస్ లు వెనక్కి తీసుకోవాలి

*నివాసం వున్న వారికే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి – వై విక్రమ్*

*సానుకూలంగా స్పందించిన కమిషనర్…*

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

నగరం నడిబొడ్డున 43 వ డివిజన్ పరిధిలోని రేవతి సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ కు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి ‌అని , గత 40 సంవత్సరాలుగా వాటిని నమ్ముకుని అక్కడే నివాసం వున్న వారికి మార్కెట్ రేట్ ప్రకారం స్థానికులకే ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపి మేయర్, మరియు కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ గతంలో సిపిఎం పార్టీ నేత చిర్రవూరి లక్ష్మినర్సయ్య పరిపాలన
పాలనా కాలంలో ఆనాడు ఖమ్మం టౌన్ లో మామిళ్ళగూడెం, బోనకల్లు రోడ్, త్రీ టౌన్ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి నివాసం వద్ద ఇలా పలు చోట్ల మున్సిపల్ అధికారులు, ఉద్యోగస్తులు, పారుశుద్దం పని చేసే వారికి క్వార్టర్ లు కట్టించారు అని తెలిపారు. అందులో భాగంగా రేవతి సెంటర్ లో 140 క్వార్టర్స్ పారుశుద్దం కార్మికుల కోసం కట్టించారు అని తెలిపారు. కాలక్రమంలో చాలా చోట్ల అక్కడే నివాసం వున్న ఉద్యోగస్తులకు స్థలం మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చారు అని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా రేవతి సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ కు నోటీసు లు ఇవ్వడంతో రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, ప్రస్తుత ఉద్యోగులు ఆందోళన కు గురయ్యారు అని పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా అక్కడే నివాసం వుండి క్వార్టర్స్ మరమత్తులు కోసం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోతే వాటినే రిపేర్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు అని తెలిపారు. స్థానికులకే క్వార్టర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2007 వ సంవత్సరంలో ఆనాడు సిపిఎం పార్టీ పరిపాలనా కాలంలో కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ సమీనా ఆఫ్రోజ్ చొ రవతో పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు అని గుర్తు చేశారు కార్పొరేషన్ అధికారులు, మేయర్, పాలక పార్టీ నేతలు ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలి అని కోరారు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి ‌అని డిమాండ్ చేశారు. మార్కెట్ రేట్ ప్రకారం వాటిని నమ్ముకుని నివాసం వున్న వారికి ప్రభుత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి క్వార్టర్స్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బుర్రి శోభారాణి, నాయకులు సిహెచ్ భద్రం, ఉపేంద్ర, రెడపంగి శ్రీను, నరసింహారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share