
**బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చట్టం చేయాలి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చట్టం చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి లింగయన్ మహారాజ్ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం, డి.ఎస్.పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చండూరు బస్టాండు నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా బిజెపి అడ్డుకుంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆరు నెలలైనా కేంద్రం స్పందించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో9ని విడుదల చేసిందన్నారు. ఆ జీవో పై హైకోర్టు స్టే విధించిందని, ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ ను తిరస్కరించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి పార్టీ పైనే ఉందన్నారు. అనంతరం చండూరు మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, బిసి, ఎస్సీ, ఎస్ టి - జేఏసీ నాయకులు వెంకటేష్, జగన్నాధం గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, ధర్మ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు శంకర్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు, సుమన్, రాజేష్, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, కృష్ణయ్య, నాగేష్, రాజు, డీఎస్పీ నాయకులు మహేష్, వెంకటేష్, స్వామి, శంకర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నగేష్, లింగస్వామి, కొట్ట రమేష్, రామ్మూర్తి, శేఖర్, అంజయ్య, చిరంజీవి, యాదయ్య, అంజి, నరేష్, గిరి, తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చట్టం చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి లింగయన్ మహారాజ్ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం, డి.ఎస్.పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చండూరు బస్టాండు నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా బిజెపి అడ్డుకుంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆరు నెలలైనా కేంద్రం స్పందించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో9ని విడుదల చేసిందన్నారు. ఆ జీవో పై హైకోర్టు స్టే విధించిందని, ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ ను తిరస్కరించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి పార్టీ పైనే ఉందన్నారు. అనంతరం చండూరు మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, బిసి, ఎస్సీ, ఎస్ టి - జేఏసీ నాయకులు వెంకటేష్, జగన్నాధం గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, ధర్మ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు శంకర్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు, సుమన్, రాజేష్, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, కృష్ణయ్య, నాగేష్, రాజు, డీఎస్పీ నాయకులు మహేష్, వెంకటేష్, స్వామి, శంకర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నగేష్, లింగస్వామి, కొట్ట రమేష్, రామ్మూర్తి, శేఖర్, అంజయ్య, చిరంజీవి, యాదయ్య, అంజి, నరేష్, గిరి, తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025