రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బ్యారీ కెడ్ ను సక్రమంగా పెట్టిన యువకులను అభినందించిన డీఎస్పీ శివరాం రెడ్డి నల్లగొండ* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (మన ప్రజావాణి)*:

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బ్యారీ కెడ్ ను సక్రమంగా పెట్టిన యువకులను అభినందించిన డీఎస్పీ శివరాం రెడ్డి నల్లగొండ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (మన ప్రజావాణి)*:

మంగళవారం రాత్రి నల్లగొండ హైదరాబాద్ రోడ్ లో ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఎస్పీ ఆఫీసు వద్ద గాలికి అడ్డంగా పడి ఉన్న ట్రాఫిక్ బ్యారి గేడ్ గమనించి అటుగా వెళ్తున్న యువకులు కంభంపాటి రాకేష్, చంద్రగిరి క్రాంతి కుమార్ ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త గా, సామాజిక బాధ్యతగా తెలుసుకొని వాటిని యధాస్థానం లో పెట్టటం జరిగింది. ట్రాఫిక్ పోలీసుకి వారు రాత్రి సమయం లో సహాయం చేసినట్లుగా ఇది గమనించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఈ రోజు అభినందించారు. అలాగే వారి ఆదేశాల మేరకు ఈ రోజు డీఎస్పీ శివరాం రెడ్డి తన కార్యాలయంలో యువకులను సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డుకు అడ్డంగా పడిపోయిన బారికేడ్స్ పట్టణానికి చెందిన యువకులు గమనించి వాహనదారులు, ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా సామాజిక బాధ్యతగా పడిపోయిన వాటిని సక్రమంగా ఉంచి ప్రమాదాలు నివారించడం కూడా ఒక సామాజిక బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రజల కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోలీస్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. అలాగే పట్టణంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులు మద్యలోనే యూ టర్న్ తీసుకోకుండా కేటాయించిన మార్గం గుండా ఒక సక్రమైన పద్ధతిలో వెళ్ళాలనీ తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద యూటర్న్ తీసుకోనే క్రమంలో షార్ట్ టర్న్ లో వాహనాలను మలపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన విధంగా జంక్షన్ లో యూటర్న్ తీసుకోనీ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిఐ మహా లక్ష్మయ్య,నార్కట్పల్లి సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share