
ప్రజావాణి గోదావరిఖని నవంబర్ 17
ఇంటర్ కాలేజీ విద్యార్థిని - చెయ్యి నుజ్జు నుజ్జ
ఎన్టీపీసీకి కృష్ణ నగర్ కు చెందిన మేఘన గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ని మేఘన సోమవారం సాయంత్రం కాలేజీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బస్టాండ్ లో బస్సులో ఎక్కే సమయంలో కిందపడి గాయపడింది. బస్ కదలడంతో మేఘన ఎడమ చేతి మీదుగా బస్ టైర్ ఎక్కడం వలన ఆమె చేతి వెళ్ళు చెయ్యి నుజ్జు నుజ్జు అయి తీవ్రంగా గాయపడింది.
సహచరులు స్థానికులు మేఘనను వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అధించారు. తదుపరి వైద్యం దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిచడం జరిగింది. మేఘనకు ఎముకలు, లిగమెంట్లు, లేదా నాడులపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు తెలిపారు.
ఈ సంఘటన స్థానికులలో ఆందోళన సృష్టించింది. బస్సు ప్రమాదాలను నివారించడానికి, ప్రయాణికులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిందని అధికారులు సూచించారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025