ప్రజావాణి వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి* *హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* *హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ప్రజావాణి వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి*

*హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్*

*హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్*

*ప్రజావాణి కార్యక్రమానికి 139 వినతులు*

హన్మకొండ నవంబర్ 17
ప్రజావాణి :

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశపు హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలకు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వినతులను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, మున్సిపల్, తదితర సమస్యలపై ప్రజలు 139 వినతులను కలెక్టర్, అదనపు కలెక్టర్లకు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వినతి పత్రాలను అందజేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులను వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పలు మండలాలకు సంబంధించిన వినతులపై పరిష్కార చర్యల నిమిత్తం తహసిల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share