సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ••• 10 సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ. •••పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్. •••ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

••• 10 సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ.

•••పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్.

•••ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన.

•••ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డు లు అందుతుంది.

••••ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏ ఏం ఆర్ గార్డెన్ లో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డు లు పంపిణి.

ముస్తాబాద్//మన ప్రజావాణి

ప్రతి పేదవాడు ప్రతిరోజు పండగల జీవించాలనే ఆలోచనతో సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి, అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పొందాలనే ప్రతి నిరుపేద కుటుంబానికి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచనతో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎమ్ఆర్ గార్డెన్ లో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డి సి ఎస్ ఓ రజిత, ఏసీఎస్ఓ శ్రీలత, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి -నరింహులు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,ముఖ్య అతిథులు గా విచ్చేశారు. ఈ సందర్బంగా చక్రధర్ రెడ్డి, బాల్ రెడ్డి మాట్లాడుతూ….. గత10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అర్హునికి రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను పొందాలని గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారని తెలిపారు. ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు జారీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలనినే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకాలను చూసి బిజెపి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడని అన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మండలానికి 574 ఇందిరమ్మ ఇండ్లు,మంజూరు చేశారాని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల నుండి రుణాలు, వడ్డీ లేని రుణం సన్న బియ్యం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గజ్జెల రాజు, రాంరెడ్డి,రెవిన్యూ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share