*మున్సిపల్ క్వార్టర్స్ నోటీస్ లు వెనక్కి తీసుకోవాలి *నివాసం వున్న వారికే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి – వై విక్రమ్* *సానుకూలంగా స్పందించిన కమిషనర్…*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*మున్సిపల్ క్వార్టర్స్ నోటీస్ లు వెనక్కి తీసుకోవాలి

*నివాసం వున్న వారికే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి – వై విక్రమ్*

*సానుకూలంగా స్పందించిన కమిషనర్…*

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

నగరం నడిబొడ్డున 43 వ డివిజన్ పరిధిలోని రేవతి సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ కు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి ‌అని , గత 40 సంవత్సరాలుగా వాటిని నమ్ముకుని అక్కడే నివాసం వున్న వారికి మార్కెట్ రేట్ ప్రకారం స్థానికులకే ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపి మేయర్, మరియు కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ గతంలో సిపిఎం పార్టీ నేత చిర్రవూరి లక్ష్మినర్సయ్య పరిపాలన
పాలనా కాలంలో ఆనాడు ఖమ్మం టౌన్ లో మామిళ్ళగూడెం, బోనకల్లు రోడ్, త్రీ టౌన్ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి నివాసం వద్ద ఇలా పలు చోట్ల మున్సిపల్ అధికారులు, ఉద్యోగస్తులు, పారుశుద్దం పని చేసే వారికి క్వార్టర్ లు కట్టించారు అని తెలిపారు. అందులో భాగంగా రేవతి సెంటర్ లో 140 క్వార్టర్స్ పారుశుద్దం కార్మికుల కోసం కట్టించారు అని తెలిపారు. కాలక్రమంలో చాలా చోట్ల అక్కడే నివాసం వున్న ఉద్యోగస్తులకు స్థలం మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చారు అని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా రేవతి సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ కు నోటీసు లు ఇవ్వడంతో రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, ప్రస్తుత ఉద్యోగులు ఆందోళన కు గురయ్యారు అని పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా అక్కడే నివాసం వుండి క్వార్టర్స్ మరమత్తులు కోసం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోతే వాటినే రిపేర్ చేసుకుని జీవనం సాగిస్తున్నారు అని తెలిపారు. స్థానికులకే క్వార్టర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2007 వ సంవత్సరంలో ఆనాడు సిపిఎం పార్టీ పరిపాలనా కాలంలో కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ సమీనా ఆఫ్రోజ్ చొ రవతో పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు అని గుర్తు చేశారు కార్పొరేషన్ అధికారులు, మేయర్, పాలక పార్టీ నేతలు ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలి అని కోరారు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి ‌అని డిమాండ్ చేశారు. మార్కెట్ రేట్ ప్రకారం వాటిని నమ్ముకుని నివాసం వున్న వారికి ప్రభుత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి క్వార్టర్స్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బుర్రి శోభారాణి, నాయకులు సిహెచ్ భద్రం, ఉపేంద్ర, రెడపంగి శ్రీను, నరసింహారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share