FLASH NEWS

నాప్స్కాబ్ డైరెక్టర్ గా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నియామకం* *జాతీయస్థాయిలో కోఆపరేటివ్ వ్యవస్థలో కీలక భూమిక పోషించనున్న చైర్మన్*

*నాప్స్కాబ్ డైరెక్టర్ గా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి నియామకం* *జాతీయస్థాయిలో కోఆపరేటివ్ వ్యవస్థలో కీలక భూమిక పోషించనున్న చైర్మన్* *కుంభంకు పలువురు శుభాకాంక్షలు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 13 (మన ప్రజావాణి)*: గత ఏడాది కాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర ( డిసిసిబి ) బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తున్న కుంభం శ్రీనివాస్ రెడ్డి నాఫ్స్కాబ్ ( నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ) డైరెక్టర్ గా నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం నాడు నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రగతి బాటలో పయనింపజేసేలా డి సి సి బి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. ఢిల్లీ కేంద్రంగా ఉండే నాప్స్కాబ్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రైతుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలలో డిసిసిబి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ సాయి డైరెక్టర్ గా ఇకనుంచి కీలక భూమిక పోషించనున్నారు. డిసిసిబి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నుండి కుంభం శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ను 3 వేల కోట్ల టర్నోవర్ కు తీసుకువెళ్లారు. అదేవిధంగా ఇటీవల లండన్ లో జరిగిన అంతర్జాతీయ కో-ఆపరేటివ్ సదస్సులో నాలుగు రోజులపాటు రాష్ట్రం తరఫున పాల్గొన్నారు. ఆయా దేశాలలో కో-ఆపరేటివ్ బ్యాంకుల తరఫున జరుగుతున్న సంక్షేమ పథకాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం కోసం ప్రణాళికలను రూపొందించారు. వినయ, విధేయతలే ఆయనకు వరం. మారుమూల ప్రాంతమైన మునుగోడు మండలం కల్వకుంట గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరి తో వినయ, విధేయత ఉంటూ తన జీవన కొనసాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ప్రభుత్వ పాఠశాలలకు కాలినడక నడిచి వెళ్లి విద్యను అభ్యసించి కొన్ని సంవత్సరాల పాటు జర్నలిస్టు గా పనిచేశాడు. ఆ పాత్రికేయ వృత్తి తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. తనకు పరిచయమైన వారితో స్నేహంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను తీసుకునేవాడు. దాంతో ఓ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ రెడ్డి అందరి ఆత్మ బంధువు, మనసున్న మహారాజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన 2009లో శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలకు వచ్చి రాజగోపాల్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ ఆయన సూచనల ప్రకారం రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మునుగోడు పిఎసిఎస్ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 13 డైరెక్టు స్థానాలకు 12 స్థానాలు తానే గెలిపించుకొని మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. అంతేకాకుండా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఏకైక డిసిసిబి డైరెక్టర్గా కూడా ఎన్నికయ్యాడు. గత ఏడాది క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఎన్నికై రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలా ఆధారంగా ఆయనను జాతీయస్థాయిలో నాప్ స్కాబ్ డైరెక్టర్ గా నియమించడం పట్ల పాలకవర్గ డైరెక్టర్ల తోపాటు, అధికారులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాఫ్స్కాబ్ డైరెక్టర్గా నూతనంగా నియమించబడిన కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనను నియమించిన మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ పదవితో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జాతీయస్థాయిలో కో-ఆపరేటివ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉత్తంకుమార్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.

పుట్ట మధుకార్ అనుచిత వ్యాఖ్యలు హాస్యాస్పదం -మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల.తిరుపతి యాదవ్.

పుట్ట మధుకార్ అనుచిత వ్యాఖ్యలు హాస్యాస్పదం -మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల.తిరుపతి యాదవ్. రామగిరి,జూలై 12 (మన ప్రజావాణి) మంత్రి శ్రీధర్ బాబు పై బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధుకార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా స్పందించింది. శనివారం రామగిరి మండలంలోని శ్రీపాద ఐఎన్టీయూసి భవన్‌లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పత్రికల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రొడ్డ బాపున్నా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ….. పుట్ట మధుకార్ అనే వ్యక్తి ప్రజల కోసం కాదు,తన రాజకీయ ఉనికికోసమే వ్యవహరిస్తున్నాడు.మంత్రి శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధిని ప్రశంసించడమే కాకుండా, ప్రజలకు ఉపయోగపడే మార్గంలో వ్యవహరించాల్సిన బాధ్యత అతనిపై ఉంది.కానీ ఆయనకు అభివృద్ధిపై లేశమాత్రమైన ఆసక్తి లేదు” అని మండిపడ్డారు. ఇటీవల రామగిరి మండలంలోని నాగపెల్లి గ్రామంలో చోటు చేసుకున్న ప్రేమవివాహ జంట ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని రాజకీయంగా వాడుకుంటూ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులపై నిందలు వేయడాన్ని ఆయన ఖండించారు.ఒకప్పుడు ఎంపీటీసీ గా,జెడ్పీ చైర్మన్‌గా ఉన్నావు కాబట్టి రాజ్యాంగ విలువల పట్ల నీకు బాధ్యత ఉండాలి. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం ఏ విధంగానూ సమర్థించదగినది కాదు. ప్రజల శాంతిని భద్రపరచాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన తెలిపారు. గత పాలనలో బీఆర్ఎస్ నాయకుల తీరుతో గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొన్నదని, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు.శ్రీధర్ బాబు నాయకత్వం లేకుండా మీ రాజకీయ జీవితం నిలదొక్కుకోలేకపోతుంది. ఆయన పేరును జపించకపోతే మీ పబ్బం గడవదన్న విషయం మీకే తెలుసుకోవాలని తిరుపతి యాదవ్ ఎద్దేవా చేశారు.మరోసారి మంత్రి శ్రీధర్ బాబు పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు లపై అసత్యపు ఆరోపణలు చేస్తే దానికి సమాధానం రెట్టింపులో ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించడం విప్లవాత్మకమైన నిర్ణయం…* *ప్రభుత్వ నిర్ణయం పద్మశాలి జాతికి శుభ సూచకం.

*బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించడం విప్లవాత్మకమైన నిర్ణయం…* *ప్రభుత్వ నిర్ణయం పద్మశాలి జాతికి శుభ సూచకం.* *తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్.* *యాదాద్రి భువనగిరి జిల్లా జూలై / 11 / మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కేబినెట్ సమావేశం లో బిసి లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చేసిన విధానాన్ని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ విప్లవాత్మకమైన , చారిత్రకమైన నిర్ణయంతో యావత్ తెలంగాణ పద్మశాలి సమాజానికి పిలుపు ఇస్తూ రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన పద్మశాలి చేనేత కార్మిక లోకం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మన పద్మశాలి జాతి ఉన్నతిని తెలియ చేయాలని కోరారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘాల నాయకులు జాతిని చైతన్యం చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి జాతిని జాగృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ప్రకటించారు. ఇది మనకు..మన కులానికి మంచి అవకాశం దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్డు మెంబర్లు మొదలుకొని సర్పంచులు , ఎంపీటీసీలు , జెడ్పీటీసీల వరకు అవకాశం ఉన్న ప్రతి చోట పోటీలో నిల్వాలని ఆయన పద్మశాలి జాతికి పిలుపునిచ్చారు. జాతిని చైతన్యం చేసే విషయంలో వర్గ వైషమ్యాలు లేకుండా కృషి చేయాలని పద్మశాలి నాయకులను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు వెంట బాలరాజు నేత పాల్గొన్నారు.

మంత్రి తుమ్మల ఆదేశాలతో “చింత గుర్తి లో 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు

మంత్రి తుమ్మల ఆదేశాలతో “చింత గుర్తి లో 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యార గర్ల హనుమంతరావు. ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి రఘునాథపాలెం మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు చింతగుర్తి గ్రామంలో 35 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రజా ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగు నింపిందని అన్నారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి కి ఖమ్మం శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరావు కొత్త కొమరయ్య సీతారామయ్య మండల అధ్యక్షులు వాంకుడోతు దీప్ల నాయక్ ఆత్మ కమిటీ చైర్మన్ దివిశాల వెంకటేశ్వర్లు తాత రఘురాం ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కార్యదర్శి హౌసింగ్ ఏఈ చింతగుర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమానికి విజయవంతంచేశారు.

*నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు*

*నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు* •కోరుట్ల సీఐ సురేష్ బాబు కోరుట్ల,జులై 11 (ప్రజావాణి) నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల కార్గిల్ చౌరస్తా వద్ద నెంబర్ ప్లేట్ లేని 50 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు,మద్యం తాగి వాహనాలు నడప రాదని చట్టాన్ని అధికమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ తనిఖీలు కోరుట్ల ఎస్ఐ చిరంజీవి,కథలాపూర్ ఎస్ఐ నవీన్, మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి లు పాల్గొన్నారు

*ఈనెల14 జరిగే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు

*ఈనెల14 జరిగే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి* సూర్యాపేట జిల్లా కోదాడ, జూలై 11/మన ప్రజావాణి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు గీతా కార్మికులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి పెంచుతామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అయినా నేటికీ పింఛన్లు పెంచకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి గడ్డం ఖాసిం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచే వికలాంగుల పింఛను 6000కు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు గీతా కార్మికులు ఒంటరి మహిళల పింఛన్లను నాలుగువేలకు పెంచుతామని హామీ ఇచ్చిన నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయిన పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు నేటికీ పింఛన్లు పెంచకుండా కాలయాపన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరు దురదృష్టకరమని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న తీరు తమ వికలాంగుల సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని ఎన్నికల సమయంలో అధికారులకు వస్తే వికలాంగుల పెన్షన్ 6000 పెంచడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తానని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరు నిరసిస్తూ ముఖ్యంగా చేయూత పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛలను అన్నింటిని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ నెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సుకు వృద్ధులు వితంతువులు వికలాంగులు బీడీ కార్మికులు గీతా కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు చీమల మండల నాయకులు రాము రాంబాబు శ్రీనివాస్ యాదయ్య సౌజన్య రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

*వృధాగా పోతున్న త్రాగునీరు

*వృధాగా పోతున్న త్రాగునీరు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 12 (మన ప్రజావాణి)*: నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ లోని హైదరాబాద్ రోడ్డు ప్రధాన రహదారి పై మిషన్ భగీరథ నీరు గత కొన్ని రోజులుగా పైపు లీకై త్రాగునీరు వృధాగా పోతుందని ప్రజలు అంటున్నారు. ఈ మిషన్ భగీరథ వాటర్ పై పత్రిక పేపర్లలో ప్రత్యేక కథనాలు వస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. అటుగా చూసుకుంటూ నాయకులు ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు గాని ఏ ఒక్కరైనా పట్టించుకోవడం లేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలలో కొంతమంది రోడ్డు పనులు జరుగుతున్నాయిగా అని మరి కొంతమంది ఈ రోడ్డు పని పూర్తి కావాలంటే ఆరు నెలలు పడుతుంది అప్పటిదాకా మిషన్ భగీరథ వాటర్ ఇలా వృధాగా పోవడం కరెక్టేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

*మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు

*మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 10 (మన ప్రజావాణి)* నల్గొండ జిల్లా లోని ప్రభుత్వ బాలికల కళాశాల నందు ప్రిన్సిపల్ సుధారాణి అధ్యక్షతన నల్గొండ ఆధ్వర్యంలో లయన్ ఎర్రమాద శ్రీనివాస్, వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు ఎర్రమాద సత్తయ్య రాములమ్మ ల స్మారకార్థం కళాశాల టాపర్స్ ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఇసి, ఒక్కొక్కరికి 1500 రూపాయలు నగదు బహుమతులను అందించారు వ్యక్తిత్వ వికాస నిపుణులు పూర్ణ శశికాంత్ చే విద్యార్థుల యువ వికాస్ కార్యక్రమంలో లక్ష్యాలు నిర్ణయించుకోవడం ఎలా స్వల్ప కాలిక లక్ష్యాలు చేరుకోవడం ఎలా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి కావలసిన టెక్నిక్స్ ను చక్కని ఆక్టివిటీస్ ద్వారా విద్యార్థుల కి తెలియజేశారు. తల్లిదండ్రుల విలువలను గుర్తించి వారిని ఏ విధంగా చూసుకోవాలో వారి ఆశయాలను సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు మనం చేయాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు దోపిడీకి వెళ్లకూడదంటూ అద్భుతమైన శైలిలో వివరించారు చివరకు అమ్మ నాన్న ల పై పాటకు స్పందించి ఏడుస్తూ తమ తల్లిదండ్రుల లక్ష్యసాధనకు వారి త్యాగానికి మా భవిష్యత్తును కానుకగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, అధ్యాపక సిబ్బంది, ఎల్ సి నల్గొండ అధ్యక్షులు పిచ్చయ్య, ఎల్సి స్నేహ బాధ్యులు సత్య శ్రీ, రవీందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.

*నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

*నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 10 (మన ప్రజావాణి)*: గురువారం ఉదయం 10 గంటలకు చండూరు మున్సిపాలిటీ లో గత 5 సంవత్సరాలుగా లోవోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న కాలనీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అయ్యప్ప నగర్ , సర్దార్ కాలిని, హైద్రాబాద్ రోడ్ లో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడమైనది ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం చేయడమైనది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లు కల్మికొండ పారిజాత జనార్ధన్, నల్లగంటి మల్లేశం,గంట సత్యం, కల్లెట్ల మారయ్య, గండూరిజనార్ధన్, ఇరిగి వెంకటేశం, పన్నాల లింగయ్య, కృష్ణారెడ్డి, జవీద్, షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

*ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు* *-రెండు దుకాణా లకు రెండు వేల జరిమానా

*ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు* *-రెండు దుకాణా లకు రెండు వేల జరిమానా* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై10 (మన ప్రజావాణి)*: నల్గొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలపై గురువారం మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని ఆర్పీ రోడ్ లోని పలు చికెన్ సెంటర్ తో పాటు కిరాణం దుకాణాలలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఆదేశాల మేరకు సహాయపు కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 120 మైక్రాలకు తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న రెండు దుకాణాలకు 2000 చొప్పున జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతం రోజురోజు పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాలకు పైబడిన ప్లాస్టిక్ నే వాడాలని సూచించారు. పట్టణంలో అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రైతు సమాజ నిర్మాణం కోసం సాగే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు నంద్యాల ప్రదీప్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

 Share

 నోటిఫికేషన్స్