‘అదానీ’ వ్యవహారంపై రాజకీయ దుమారం.. కేంద్ర, రాష్ట్రాల రియాక్షన్

Ramesh

Ramesh

District Chief Reporter

అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీ(Adani)పై అమెరికా(US)లో కేసులు నమోదవడంపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడిగా గౌతం అదానీని భావిస్తుంటారు. అటువంటి పారిశ్రామిక దిగ్గజం చుట్టూ అమెరికాలో చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండటాన్ని భారత్‌లోని కేంద్ర(Centre Govt), రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదానీ గ్రూపుపై అమెరికాలో కేసులు నమోదైనందున తాము స్పందించేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదానీ గ్రూపు వ్యవహారంలో పేర్లు వినిపిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై క్లారిటీ ఇస్తే సరిపోతుందని బీజేపీ వాదిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ ప్రస్తుతం ఫోకస్‌లో ఉన్నాయి.

‘‘అదానీ గ్రూపుతో తమిళనాడు విద్యుత్ శాఖ నేరుగా ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదు. 25 ఏళ్ల పాటు ఒక్కో యూనిట్‌కు రూ.2.61 చొప్పున వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్’తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ దీనిపై స్పందిస్తూ.. తమ హయాంలో అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో గత బీజేడీ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా వ్యవహరించిన పి.కె.దేవ్ స్పందిస్తూ.. అదానీ గ్రూపు నుంచి తాము ఎలాంటి ముడుపులూ తీసుకోలేదని తేల్చి చెప్పారు. నిరాధార ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

 Share