మూడో రోజూ భారత్‌దే.. పెర్త్ టెస్టులో విజయం దిశగా టీమిండియా

Ramesh

Ramesh

District Chief Reporter

ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తున్నది. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలకు తోడు మూడో రోజే ఆసిస్ పతనం మొదలవడంతో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్ప విజయం దాదాపు ఖాయమే. బుమ్రా ధాటికి ఆసిస్ మూడో రోజే మూడు వికెట్లు కోల్పోగా.. మరో 7 వికెట్లు తీస్తే మ్యాచ్ మనదే. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజూ భారత్‌దే. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 170/0తో ఆట కొనసాగించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. యశస్వి జైశ్వాల్(161, 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించగా.. కోహ్లీ(140 నాటౌట్, 143 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స్‌లు) కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత్.. ఆసిస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలోనూ కంగారుల జట్టు తడబడింది. మూడో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా మరోసారి వికెట్ల వేట మొదలుపెట్టాడు. రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌‌లోనే ఆసిస్‌కు షాకిచ్చిన అతను..ఓపెనర్ మెక్‌స్వీనీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే ప్రమోషన్‌పై ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కమిన్స్(2)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే బుమ్రా.. లబుషేన్(3)ను అవుట్ చేశాడు. ఆ బంతి తర్వాత అంపైర్లు మూడో రోజు ముగిసినట్టు ప్రకటించారు. ఆసిస్ చేతిలో ఇంకా 7 వికెట్లు ఉండగా.. ఆ జట్టు ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share