ఇంటిని మినీ కశ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంపతులు

Ramesh

Ramesh

District Chief Reporter

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే ‘కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. ఇందుకోసం వారు తమ ఇంటిని మినీ-కాశ్మీర్‌గా మార్చుకున్నారు.

దంపతుల సంకల్పం, అంకితభావం మరియు కృషితో కేవలం మూడు నెలల వ్యవధిలోనే కుంకుమ పువ్వులు వికసించాయి. ఇండోర్‌లోని సాయి కృపా కాలనీ నివాసి, సాగుదారు అనిల్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని తమ ఇంటి వద్ద అనుకూలమైన పరిస్థితిని సృష్టించడం ద్వారా కుంకుమ పువ్వు పంటను పండించే తన ఆలోచనలను పంచుకున్నారు. తాను సంప్రదాయ వ్యవసాయం చేసే కుటుంబానికి చెందినవాడినని, కాశ్మీర్ పర్యటన తర్వాత కుంకుమపువ్వు సాగు చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు.

 

తమ కుటుంబం సాంప్రదాయ వ్యవసాయంలో నిమగ్నమై ఉందని, కొంతకాలం క్రితం, కుటుంబంతో కలిసి కాశ్మీర్‌కు వెళ్లగా శ్రీనగర్ నుండి పాంపోర్‌కు వెళ్లే మార్గంలో కుంకుమపువ్వు సాగును చూసే అవకాశం లభించిందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా అన్నారు. ఆ తరువాత తాము ఇండోర్‌లో ఆదర్శ ఉష్ణోగ్రత మరియు వాతావరణ పరిస్థితులను సృష్టించడం ద్వారా దాని సాగు గురించి ఆలోచింనట్లు జైస్వాల్ చెప్పారు. జైస్వాల్ జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పాంపోర్, టౌన్ నుండి కుంకుమపువ్వు బల్బులను (కార్మ్) పొందారు.

8 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతను కొనసాగిస్తూ, కృత్రిమ వాతావరణ పరిస్థితులతో కూడిన గదిని సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు కాగా, పాంపోర్ నుండి బల్బులను సోర్సింగ్ చేయడానికి అదనంగా మరో రూ. 7 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరులో 320 చదరపు అడుగుల విస్తీర్ణంలో కుంకుమపువ్వు సాగు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. సుమారు 2 కిలోల కుంకుమ పువ్వు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని, ప్రస్తుతం పూల నుంచి కుంకుమ దారాలు తీసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. భారత్‌లో కిలో రూ. 5 లక్షలు ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 8 లక్షల వరకు పలుకుతుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించాలని యోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

 Share