షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా.? లేదా.? ఈ ముఖ్య విషయాలు మీకోసమే.??

Ramesh

Ramesh

District Chief Reporter

మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు డేట్స్ ని తీసుకుంటూ ఉంటాము. ఈ డేట్స్ లో ఖర్జూరాలు కూడా ఒకటి. అయితే ఈ ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే ఈ ఖర్జూరాలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే
డయాబెటిస్
ఉన్నవారు మాత్రం వీటిని మితంగా తీసుకుంటేనే మంచిది అని అంటున్నారు. ఖర్జూరంలో ఫైబర్ మరియు ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ కె బి కాంప్లెక్స్,జింక్ సవృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ ఖర్జూరంలో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజు రెండు లేక మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అనేది కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది అని అంటున్నారు…

Diabetes : షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా…? లేదా…? ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

అయితే ఈ ఖర్జూరం తియ్యగా మరియు కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కావున ఖర్జూరం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచదు. అలాగే ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్న పేషెంట్లు తినొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఖర్జూరంలో గ్లైసేమిక్ ఇండెక్స్ 43 నుండి 55% వరకు ఉంటుంది. కావున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు. అందుకే వీటిని తీసుకోవచ్చు అని అంటున్నారు. దీనిలో ఫైబర్ కంటెంట్ షుగర్ పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఖర్జంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది…

ఖర్జూరాలలో కాల్షియంతో పాటుగా మరెన్నో మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఏ ఈ ఇతర విటమిన్లు కళ్ళు మరియు రక్తం, జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచగలవు. అలాగే శరీరంలో వాపు మరియు మంట తగ్గించేందుకు కూడా ఈ ఖర్జూరాలు హెల్ప్ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతిరోజు వీటిని కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే అతిగా తింటే ఖర్జూరాలలో కార్బ్స వలన దుష్ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. అందుకే డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజుకు రెండు ఖర్జూరాలను మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు. అతిగా తీసుకోవద్దు అని అంటున్నారు. అయితే వీటిని తినే ముందు డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి. వారి సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి అని అంటున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్* *మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు.* *… జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 22 (మన ప్రజావాణి)*: గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెర నుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయం తో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు* . వడ్త్య జవాహర్ లాల్ తండ్రి రాములు, వయస్సు: 50 సం.లు, నివాసం : బనాలకుంట గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. రామవత్ రమేష్ తండ్రి లక్పతి , వయస్సు: 24 సం.లు,నివాసం : పాయ తండా గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. మైలపల్లి శివ తండ్రి దేవుడు, వయస్సు: 30 సం.లు, నివాసం : ఇంటి నెంబర్. 4-45 వాడపాలెం గ్రామం, రాంబిల్లి మండల్, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. కారే సింహా చలం తండ్రి: సింహా చలం, వయస్సు: 39 సం.లు, నివాసం : బంగారమ్మపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, వయస్సు: 26 సం.లు, నివాసం : అమలాపురం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, వయస్సు: 45 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. చాపల తాత రావు తండ్రి: సోమరాజు, వయస్సు: 38 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ. చాపల బంగారి తండ్రి: బంగారి వయస్సు: 39 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. *నమోదైన కేసుల వివరాలు* : క్రైమ్. నెంబర్.66/2025 యు/ఎస్ 143(4), 146 బి ఎన్ ఎస్ సెక్షన్. 79 ఆఫ్ జె జె యాక్ట్ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ , క్రైమ్ నెంబర్. 68/2025 యు/ఎస్ 146 బి ఎన్ ఎస్ సెక్షన్.18 ఆఫ్ బిఎల్ఎస్ఎ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్. 69/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ పి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్.117/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.18 బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ గుడిపల్లి, క్రైమ్. నెంబర్.118/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 ఆఫ్ జె జె యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పి ఎస్ గుడిపల్లి *కేసు వివరాలు* పైన తెలిపిన నిందితుల లో గుడిపల్లి కి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్, శివ లు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది. మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేశ్, వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఈ ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు, గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్, చైల్డ్ లైన్ , సి డబ్ల్యూ సి బృందం, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.‌ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 నోటిఫికేషన్స్

 Share