
*తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మరో పథకం అమలుకు సిద్ధం…*
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలుకు సర్వ సిద్ధం గత పాలకుల పాలనలో గిరిజన రైతుల పట్ల చిన్న చూపు
పాదయాత్ర సమయంలో గిరిజన రైతుల బాధలు చూసి పథకం రూపకల్పనకు శ్రీకారం చుట్టిన నాటి సిఎల్పీ నేత,నేటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కులు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడానికి ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం జీవో విడుదల
ఈ పథకానికి 12,600 కోట్ల రూపాయల కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
అచ్చంపేట నియోజకవర్గం, అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఈనెల 18లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు పొంది ఉన్న 2.10 లక్షల మంది రైతులకు ఐదు సంవత్సరాలలో ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించే విధంగా పథకం రూపకల్పన