
రాజన్న సిరిసిల్ల జిల్లా లో హత్య కలకలం.
మన ప్రజావాణి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం: గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన సతీష్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఘటన కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.