సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ••• 10 సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ. •••పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్. •••ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

సంక్షేమ పథకాలలో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

••• 10 సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు లు ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ.

•••పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్.

•••ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన.

•••ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డు లు అందుతుంది.

••••ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏ ఏం ఆర్ గార్డెన్ లో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డు లు పంపిణి.

ముస్తాబాద్//మన ప్రజావాణి

ప్రతి పేదవాడు ప్రతిరోజు పండగల జీవించాలనే ఆలోచనతో సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి, అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పొందాలనే ప్రతి నిరుపేద కుటుంబానికి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచనతో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఎమ్ఆర్ గార్డెన్ లో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డి సి ఎస్ ఓ రజిత, ఏసీఎస్ఓ శ్రీలత, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి -నరింహులు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,ముఖ్య అతిథులు గా విచ్చేశారు. ఈ సందర్బంగా చక్రధర్ రెడ్డి, బాల్ రెడ్డి మాట్లాడుతూ….. గత10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అర్హునికి రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను పొందాలని గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారని తెలిపారు. ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు జారీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలనినే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకాలను చూసి బిజెపి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడని అన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మండలానికి 574 ఇందిరమ్మ ఇండ్లు,మంజూరు చేశారాని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల నుండి రుణాలు, వడ్డీ లేని రుణం సన్న బియ్యం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గజ్జెల రాజు, రాంరెడ్డి,రెవిన్యూ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్* *మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు తప్పవు.* *… జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 22 (మన ప్రజావాణి)*: గత కొంత కాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ పని సమయ వేళలు పాటించకుండా ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెర నుండి , దేవరకొండ సబ్ డివిజన్ పరిధి లో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయం తో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగినది. *నిందితుల వివరాలు* . వడ్త్య జవాహర్ లాల్ తండ్రి రాములు, వయస్సు: 50 సం.లు, నివాసం : బనాలకుంట గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. రామవత్ రమేష్ తండ్రి లక్పతి , వయస్సు: 24 సం.లు,నివాసం : పాయ తండా గ్రామం. పి.ఏ పల్లి మండల్ నల్గొండ జిల్లా. మైలపల్లి శివ తండ్రి దేవుడు, వయస్సు: 30 సం.లు, నివాసం : ఇంటి నెంబర్. 4-45 వాడపాలెం గ్రామం, రాంబిల్లి మండల్, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. కారే సింహా చలం తండ్రి: సింహా చలం, వయస్సు: 39 సం.లు, నివాసం : బంగారమ్మపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. వంక విశాఖ @ ఇషాక్ తండ్రి: మహంకాల్, వయస్సు: 26 సం.లు, నివాసం : అమలాపురం గ్రామం, అనకాపల్లి జిల్లా, ఆంద్రప్రదేశ్. ఎరిపల్లి బాబుజీ @ బావొజి తండ్రి: బంగారి, వయస్సు: 45 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. చాపల తాత రావు తండ్రి: సోమరాజు, వయస్సు: 38 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ. చాపల బంగారి తండ్రి: బంగారి వయస్సు: 39 సం.లు, నివాసం : వైజాగ్ కాలనీ గ్రామం, నేరేడుగొమ్ము, నల్గొండ జిల్లా. *నమోదైన కేసుల వివరాలు* : క్రైమ్. నెంబర్.66/2025 యు/ఎస్ 143(4), 146 బి ఎన్ ఎస్ సెక్షన్. 79 ఆఫ్ జె జె యాక్ట్ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ , క్రైమ్ నెంబర్. 68/2025 యు/ఎస్ 146 బి ఎన్ ఎస్ సెక్షన్.18 ఆఫ్ బిఎల్ఎస్ఎ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్. 69/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ పి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ నేరేడుగోమ్మ, క్రైమ్. నెంబర్.117/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.18 బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పిఎస్ గుడిపల్లి, క్రైమ్. నెంబర్.118/2025 యు/ఎస్ 146 బిఎన్ఎస్ సెక్షన్.75 ఆఫ్ జె జె యాక్ట్, సెక్షన్.18 ఆఫ్ బి ఎల్ ఎస్ ఏ ఆఫ్ పి ఎస్ గుడిపల్లి *కేసు వివరాలు* పైన తెలిపిన నిందితుల లో గుడిపల్లి కి చెందిన జబ్బార్ @ జవహర్ లాల్, రమేశ్, శివ లు వీరి ఏజెంట్లు అయిన రాజు,(హైద్రాబాద్) జగన్, (హైద్రాబాద్) లోకేశ్ (విజయవాడ)లకు ఒక వ్యక్తి కి 1500 చొప్పున కమిషన్ ఇచ్చి హైద్రాబాద్ విజయవాడ నుంచి వలస కార్మికులను నెలకు 15 వేల జీతం, రోజుకి 2 గంటల పని, ఉచిత ఆహారం మరియు మద్యం సరఫరా చేస్తాం అని మబ్య పెట్టి వారిని అక్కడ నుంచి దేవరకొండ లోని మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడ నుంచి నిందితులు వారి సెల్ ఫోన్ తమ అదినంలో పెట్టుకొని వారిని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల పైన నేరేడు గుమ్ము పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణాలకుంట,వైజాగ్ కాలనీ కి తరలించి వారితో అక్కడ తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారు. అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారు. వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే ఆహారం అందిచేవారు. వీరికి పని బారం ఎక్కువ అయితుంది. మేము చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారు. ఇదే విదంగా నిందితులు అయిన ఇషాక్ మరియు సింహాచలం వారి ఏజెంట్ అయిన వెంకన్న (విజయవాడ) (5000 ఒక్కరికీ కమిషన్) కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. పైన తెలిపిన ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేశ్, వెంకన్నలు కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా బాల బాలికలను పనిలో పెట్టుకున్న చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకున్న చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఈ ఆపరేషన్ ను దేవరకొండ ఎ ఎస్పి మౌనిక పర్యవేక్షణలో డిండి, కొండమల్లేపల్లి సిఐ లు, గుడిపల్లి, నేరేడు గుమ్ము , గుర్రంపోడ్ ఎస్సై రెవెన్యూ, చైల్డ్ కేర్, చైల్డ్ లైన్ , సి డబ్ల్యూ సి బృందం, నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.‌ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి తదితరులు జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

 నోటిఫికేషన్స్

 Share